Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh పాము కాటుకు గురైన విద్యార్థిని పరామర్శించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ..

పాము కాటుకు గురైన విద్యార్థిని పరామర్శించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ..

by Prakash
MLC Kancharla Srikanth visited the student

ద్రావిడ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి బాబు పాముకాటుకు గురికాగా చికిత్స పొందుతున్న బాబును శుక్రవారం టిడిపి కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం వచ్చాక అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, అందుకు ఉదాహరణ ద్రావిడ విశ్వవిద్యాలయం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ద్రావిడ విశ్వవిద్యాలయంలో వేల పది మంది విద్యార్థులతో కళకళలాడిందన్నారు.

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం లేదన్నారు. వర్సిటీ హాస్టల్ భవనంలోకి పాము వచ్చి విద్యార్థిని కరిచిన అక్కడ సిబ్బంది పట్టించుకోకపోవడంతో తోటి విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారన్నారు. విద్యార్థి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన బాబు అనే విద్యార్థికి ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఎవరు బాధ్యత తీసుకునే వారిని ప్రశ్నించారు. పాము కరిచినట్టు బయటకు చెబితే మార్కులు కట్ చేస్తామంటూ వార్డెన్ బెదిరిస్తున్నట్లు విద్యార్థి తెలిపారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వర్సిటీ కి పూర్వ వైభవం తీసుకొస్తామని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

039769
Total views : 200797

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: