Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home TelanganaHyderabad కూకట్పల్లిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు..

కూకట్పల్లిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు..

by Rama
kukatpally

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు తో కలిసి బాలాజీ నగర్ డివిజన్ లోని వివిధ ప్రాంతాల్లో అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించారు.. ఇందులో భాగంగా ఆంజనేయ నగర్… బాలాజీ నగర్, కెపిహెచ్బి రోడ్ నెంబర్ 1..3.. లో ప్రజలతో మాట్లాడుతూ ఒకప్పుడు బాలాజీ నగర్ డివిజన్లో మంచినీళ్లు కొరతతో చాలా ఇబ్బంది పడే వారమని ఇప్పుడు 24 గంటలు విద్యుత్ మంచినీరు, సిసి రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో చేసి చూపించామని అన్నారు. బాలాజీ నగర్ లో ఇంకా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని ఇప్పటికే ప్రణాళిక బద్ధంగా డ్రైనేజీ సమస్యను పరిష్కరించి వస్తున్నామని భవిష్యత్తులో నాళాలు సమస్య అనేది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే చెరువులు సుందరీ కరణతో ఇప్పటికే రంగధామును చెరువును అత్యద్భుతంగా తీర్చిదిద్దుకున్నామని మిగిలిన చెరువులను కూడా సుందరీకరించుకుని ఎస్టీపి ప్లాంట్లు నిర్మాణం పూర్తిచేసుకుని కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చబోతున్నామని అన్నారు.. ఇంత అత్యద్భుతమైన ప్రణాళికలు ఉండబట్టే నేడు తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతుందని ఇటువంటి ముందుచూపు ఉన్న వ్యక్తినే మళ్లీ సీఎం గా కొనసాగించాలని అందుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ కు అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించుకుందామని.. తాను పోటీ చేస్తున్న కూకట్పల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇప్పించి గెలిపించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్.. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Advertisements

You may also like

Our Visitor

014246
Total views : 79617

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.