రావులపాలెం… మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం జలమయమయ్యింది.ప్రాంగణం పూర్తిగా నీట మునగడంతో బస్సుల రాకపోకలు నిలిపివేశారు. దీంతో నిత్యం ప్రయాణీకులతో రద్దీగా ఉండే బస్ స్టేషన్ బోసిపోయి కనిపించింది. ప్రయాణికులు జాతీయ రహదారిపై బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది.