Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Latest News బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది…

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది…

by Prakash
Tummala Nageswara Rao

జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురానగర్ లోని శ్రీనివాస కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ కి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ని గెలిపించాలని కాలనీ వాసులకు పిలుపునిచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు అన్ని రంగాలలో వెనకబడి ఉన్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక తెలంగాణ ఇస్తే కెసిఆర్ కుటుంబం అక్రమపాలన కొనసాగిస్తుందని విమర్శించారు. చంద్రబాబు హాయంలో ఐటీ కంపెనీలు అభివృద్ధి చెందాయి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి పరిపాలన అందిచారాన్నారు. ప్రస్తుతం ఉన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కు రాజకీయ బిక్ష పెట్టిన ఎన్టీఆర్ నే విస్మరిస్తున్నార్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పోయి, తెలంగాణ రాష్ట్రం అభిరుద్ధి చెందాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించి, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ కి ఓటు వేసి అత్యధిక మెజారిటితో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

009346
Total views : 61863

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.