మద్యం కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మద్యం కేసులో వాదనలు ముగిశాయి. ఈ రోజు సీఐడీ తరపున AG వాదనలు వినిపించగా, చంద్రబాబు తరపున రిప్లై వాదనలు పూర్తయ్యాయి. సోమవారం లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సోమవారం లిఖిత పూర్వక వాదనలు అనంతరం హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొల్లు రవీంద్ర తరపున కూడా వాదనలు పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.