96
రాష్ట్రంలో ఎవరూ ఆకలితో బాధపడొద్దని సీఎం చంద్రబాబు నాయుడు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పటమట హైస్కూల్ వద్ద సతీమణి నారా భువనేశ్వరితో కలిసి అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 269 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయని, త్వరలో మరో 5 ప్రారంభించనున్నట్లు తెలిపారు. అన్నదానంలో భువనేశ్వరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా అన్నదానం చేయాలని పిలుపునిస్తూ..ఇది ప్రజా ఉద్యమంగా మారాలని కోరారు. నిరుపేదలకు పౌష్టికాహారం, పరిశుభ్రమైన వాతావరణంలో అందించడం లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.





Total views : 81456