ప్రకాశం జిల్లాలోని ఒక మద్యం దుకాణంలో పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు ఒక యువకుడు. దర్శి లో ఆర్టీసీ డిపో ప్రక్కన ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలోకి పెట్రోల్ ను విసిరి నిప్పు అంటించాడు ఉల్లగల్లు గ్రామానికి చెందిన మోతుకూరి వంశీ కృష్ణ అనే యువకుడు. వెంటనే స్పందించిన మద్యం దుకాణంలోని ఉద్యోగులు ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Crime
గంగూరు శాఖ యూనియన్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. గంగూరు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న ప్రభావతికి భర్తతో విబేధాలున్నాయి. ఆమె స్వగ్రామం నూజి వీడు మండలం మర్రి బంధం గ్రామం, కాగా అదే గ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైదరాబాద్ లో ఉన్న బ్యాంకు ఖాతాను ప్రభావతి గంగూరు శాఖకు ట్రాన్స్ఫర్ చేయించింది. ఈ సందర్భంగా యోగేశ్వరరావు తన వద్ద ఉన్న పాత్రలు, బంగారం కోసం లాకరు అడిగాడు. ప్రభావతి లాకరులో బంగారం దాయటం కన్నా బ్యాంకు రుణం తీసుకోమని, నాకు టార్గెట్లు ఉన్నాయి అని ఆయనకు సూచించింది. దీంతో యోగేశ్వర రావు రూ.2 లక్షలు రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణాన్ని ఆయన గతేడాది నవంబరులో చెల్లించాడు. అనంతరం బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు గురించి అడగ్గా ఆ నగలు తన వద్దనే ఉన్నాయని ప్రభావతి తెలిపింది. ఈ విషయమై గంగూరులోని తన ఇంటికి వచ్చి మాట్లాడమని కోరింది. యోగేశ్వరరావు ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభరణా విషయమై ప్రశ్నించగా తనంటే ఇష్టమని, పెళ్లి చేసుకోమని కోరింది. బంగారు ఆభరణాలతో వడ్డాణం చేయిస్తున్నానని చెప్పింది. ఒక్కసారిగా యోగేశ్వరరావు షాక్ తిన్నాడు. ఈ ఘటనపై యోగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రమేయం లేకుండా తన సంతకాన్ని ప్రభావతి ఫోర్జరీ చేసి ఆభరణాలు కాజేసిందని పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Read Also…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి మండలంలో కాజా టోల్గేట్ వద్ద అనుమానంతో రెండు వాహనాలను తనిఖీ చేయగా అందులో 80 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 20 లక్షలు. నలుగురు యువకులను అదుపులో తీసుకున్నారు. ఇద్దరు పరారయ్యారు. ముద్దాయిలు తిరుపతి జిల్లాకు చెందిన వారని, విశాఖ నుంచి తిరుపతికి తరలిస్తున్నట్లు ఎస్సీబీ అధికారులు తెలిపారు.
కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై కురుమద్దాలి వద్ద దగ్ధమవుతున్న కారు, కారులో ఉన్న వ్యక్తులు దిగి పారిపోయినట్లు సమాచారం. భీమవరం నుంచి హైదరాబాద్ వెళుతున్న ముగ్గురు యువకులు. ఇంజన్లో నుంచి మంటలు రావడంతో కారు దిగి పారిపోయిన యువకులు, టాటా హేరియర్ డీజిల్ కారు పూర్తిగా దగ్ధం అయినట్టు సమాచారం.
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామ సమీపంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆ వ్యక్తి వద్ద నుండి రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఎనిమిది కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుండి హైదరాబాద్ గంజాయిని తీసుకు వెళ్తు తనికెళ్ల సమీపంలో దిగి వేరొక వాహనం కోసం ఎదురుచూస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు పట్టుబడిన వ్యక్తి మల్కన్గిరి, ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు. గంజాయి తో పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేసి ఖమ్మం కోర్టుకు తరలించారు దాడులలో ఎక్సైజ్ అధికారులు రమ్య, కిరీటి, మమత సిబ్బంది ఫాల్గొన్నారు.
అనంతపురం జిల్లా కంబదురు ములకనూరు 2 అంగన్వాడీ లో గర్భవతులకు బాలింతలకు కు పెట్టే పౌష్టికాహారం పక్కదారి. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్తులు. సిడిపిఓ సమాచారం ఇవ్వడంతో ఆమె వెళ్లి తనిఖీ చేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ములకనూరులోని అంగన్వాడీ కేంద్రం – 2 లో అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టించినదని రెడ్ హ్యాండెడ్ గా గ్రామస్తులు పట్టుకున్నారు. అయితే అంగన్వాడీలు సమ్మె బాట పట్టిన సమయంలో జరిగిందా ఇప్పుడు జరిగిందా అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడి సెంటర్ కు చెందిన టాయిలెట్ గదిలో దాచిన ఐదు కేజీల గల పది ప్యాకెట్లు బియ్యం, 20 ఆయిల్, గోధుమ పిండి, 10 ప్యాకేట్లు కందిబ్యాగులు, ఈ నెల పంపిణీ చేయాల్సిన పౌష్టికాహారాన్ని టాయిలెట్ గదిలో దాచడంతో గ్రామస్తులు తాళాలు పగలగొట్టి అందులో లభ్యమైన పౌష్టికాహారాన్ని బయట పెట్టి గుట్టు రట్టు చేశారు. సిడిపిఓ పక్కదారి పట్టించిన అంగన్వాడి సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్తపేట మండలం పలివెల గ్రామం చౌదరిపురం సత్తెమ్మ తల్లి గుడి వద్ద రోడ్డు పై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇరువురు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం ఆచంటకు చెందిన ఆటో డ్రైవర్ బండి మోషే రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు కు చెందిన చీమల మాధవరావు మోటార్ సైకిల్ పై వస్తుండగా ఇరువురు ఎదురెదురుగా ఆటో, బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే ఇరువురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చీమల నరసింహారావు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పుట్టపర్తి నియోజకవర్గం ఓడి చెరువు మండల పరిధిలోని తూవంకపల్లి గ్రామానికి చెందిన పాలిమినేని నంజప్ప నాయుడు (50) అడవి పందుల కేసిన ఉచ్చులో చిక్కుకొని తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. ఏఎస్ఐ కిషోర్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు గత రాత్రి తూవంకపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో స్వయంగా అతనే అడవి పందులు పట్టుకోడానికి.. పెద్ద లైను అయిన 11/33.. విద్యుత్తు లైనులకు తాను తయారు చేసుకున్న, ఉచ్చు తీగలను అమర్చాడు. ఉదయం ఏవైనా అడవి పందులు ఉచ్చులో చిక్కుకున్నాయని పరిశీలించాడానికి వెళ్లిన సమయంలో సదరు గొర్రెల కాపరి నంజపునాయుడే ఆ ఉచ్చులో చిక్కుకొని తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. గొర్రెల కాపరి నంజప్పకు భార్య, కుమార్తె, కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ వద్ద అక్రమంగా బంగారం తరలిస్తున్న పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 6 కేజీల బంగారు ఆభరణాలు 49 వేల నగదును స్వాధీన పరుచుకున్నట్లు భీమవరంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రవి ప్రకాష్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు నుంచి రాజమండ్రి వెళ్తుండగా మార్గమధ్యలో భీమవరంలో రైలు దిగి రోడ్డు మార్గాన రాజమండ్రి వెళ్తున్న నేపథ్యంలో నిందితులను టౌన్ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని వెల్లడించారు. పట్టుపడ్డ బంగారు ఆభరణాలు విలువ మూడు కోట్ల 84 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు.