నల్లగొండ జిల్లా నకిరేకల్ లో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను నకిరేకల్ పోలిసులు అదుపులోకి తీసుకోని అరెస్టు చేశారు. నకిరేకల్ కు చెందిన ముగ్గురు యువకులు గంజాయి విక్రయిస్తుండగా యాదాద్రి జిల్లా అడ్డ గూడూరు మండలం గట్టు సింగారం గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కోనుగోలు చేస్తుండగా వారిని నకిరేకల్ పోలిసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న గంజాయి మరియు సేవిస్తున్నా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా వీరు జల్సాలకు అలవాటు పడి గంజాయి మత్తుకు బానిసైతున్నారాని. నకిరేకల్ లో మాదకద్రవ్యాలు విక్రయించే స్థావరాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని నకిరేకల్ సిఐ రాజశేఖర్ తెలిపారు.
Crime
తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలుడిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అనుమానంతో అమ్మాయి అన్న అతని ఆరుగురు స్నేహితులు కలిసి మైనర్ బాలుడు మరియు అతని ఇద్దరు స్నేహితులను స్వగ్రామ మైన ముక్తాపూర్ వద్ద పొలం గట్ల మధ్య తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టడంతో పాటు ఐరన్ రాడులను కాల్చి వాతలు పెట్టారు అర్ధరాత్రి ఐనా పిల్లలు రాలేదని తల్లిదండ్రులు వారికి ఫోన్ చేయడంతో సదరు మైనర్ బాలురను వదిలిపెట్టిన నిందితులు. దెబ్బలను గ్రహించిన తల్లిదండ్రులు మందలించడంతో బయటికి వచ్చిన పూర్తి వ్యవహారం తెలుసుకొని, తెల్లవారుజామున పోలీస్ స్టేషన్లో బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు ప్రస్తుతం చికిత్స పొందుతుండగా బాధితులు. నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపిన భూదాన్ పోచంపల్లి పోలీసులు.
గుంటూరు జిల్లా కు చెందిన రామినేని మహేష్ బాబు(32) ఉద్యోగం నిమిత్తం 8 నెలల క్రితం నగరానికి వలస వచ్చీ రామచంద్రపురం LIG కాలనీ లో నివాసం ఉంటున్నాడు. నగరం లోని ఓ కంపెనీ లో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మహేష్ బాబు. పని నిమిత్తం మియాపూర్ కు స్కూటీ పై వెళ్తున్న మహేష్ బాబు ను వెనుక నుండి అతి వేగంగా వచ్చి డీ కొట్టిన డీసీఎం వాహనం. తీవ్ర రక్తస్రావం అయిన మహేష్ బాబు ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలింపు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలింపు. భార్య రత్నంబా ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
హైదరాబాద్ సమీపంలో గంజాయి ఆయిల్ అమ్ముతున్న ముఠాపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హాషీస్ ఆయిల్ అమ్ముతున్న బాలరాజు, సతీష్, నగేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నాగార్జున అనే నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుండి 2 లీటర్ల హషీష్ ఆయిల్ తో పాటు 12 వందల రూపాయల నగదు, 3 మొబైల్స్, ఒక పల్సర్ బైక్, సిరంజీల ప్యాకెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మెటీరియన్ విలువ దాదాపు 12 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also..
Read Also..
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇల్లినాయ్ రాష్ట్రంలోని షికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఏడుగురి ప్రాణాలు తీశాడు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసు అధికారులు వెల్లడించారు. దుండగుడి కోసం వేట కొనసాగిస్తున్నామని తెలిపారు. నగరంలో జోలియట్లోని వెస్ట్ ఎకర్స్ రోడ్లో ఉన్న 2200 బ్లాక్లో ఈ కాల్పుల ఘటన జరిగిందని, నిందితుడిని రోమియో నాన్స్ గా గుర్తించామని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని వివరించారు. రెండు ఇళ్లపై కాల్పులు జరిపాడని, మొత్తం ఏడుగురు మృత్యువాతపడ్డారని జోలియట్ పోలీసులు వెల్లడించారు.
నిందితుడు నాన్స్ కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే నివసిస్తాడని తెలిపారు. ఎరుపు రంగు టయోటా క్యామ్రీ కారులో పరారైనట్టు భావిస్తున్నామని, అతడి వద్ద ఆయుధం ఉందని, అతడిని ప్రమాదకరంగా పరిగణించాలని అక్కడి పౌరులను జోలియట్ పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తం చేసింది. నాన్స్కు సంబంధించిన సమాచారం, అతడి జాడకు సంబంధించి ఏమైనా తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కాగా అగ్రరాజ్యం అమెరికా కాల్పుల ఘటనలతో వణికిపోతోంది. గణనీయ సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది మొదటి మూడు వారాల్లోనే 875 తుపాకీ కాల్పుల మరణాలు నమోదయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
మెదక్ లోని నవాబు పేట వీధిలో యువకుడి దారుణ హత్య, జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో సోమవారం రాత్రి బొండుగుల నగేష్ (25) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. రంజిత్ కుమార్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. నగేష్ తమ్ముడు విజయ్ పాల్ రంజిత్ కుమార్ అక్కని సోమవారం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన రంజిత్, నగేష్ ను పొడిచాడు. ఈ ఘటనలో నగేష్ చనిపోగా, అతని తండ్రి యాదగిరి, కజిన్ పోతరాజు సాయి కుమార్ కు గాయాలయ్యాయి.
మంచిర్యాల జిల్లాలో మైనర్ బాలిక ప్రసవం కలకలం రేపింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. తనకు కడుపు నొప్పి వస్తుందని తల్లికి చెప్పడంతో ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో ప్రసవించింది. ఆమెను మాతా శిశు సంక్షేమ ఆసుపత్రికి తరలించారు. తల్లీ శిశువు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మైనర్ బాలికను గర్భం దాల్చింది ఎవరు అని జిల్లా కేంద్రంలో చర్చ కొనసాగుతుంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు ధర్యప్తులో విషయం తెలనుంది.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు కెనాల్ రోడ్ లో సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతరలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. అమ్మవారి ఊరేగింపులో తలెత్తిన వివాదంలో ఒక వర్గంపై మరో వర్గం కర్రలు కారం చల్లి దాడి చెయ్యడంతో ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటన ప్రాంతానికి చేరుకున్న మొగల్తూరు పోలీసులు ఇరువర్గాలను చేదరగొట్టడం తో వివాదం సద్దుమణిగింది.
చిత్తూరు జిల్లా, కుప్పం మండల పరిధిలోని బంగారునత్తం చెరువులో శనివారం యువకుడు గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సంజయ్ తల్లిదండ్రులు రవి, మంజుల మీడియాతో మాట్లాడుతూ, తమ బిడ్డ సంజయ్ ను శనివారం ఉదయం 10 గంటలకు సమయంలో రవీందర్ అనే యువకుడు ఇంటి నుండి కారులో తీసుకెళ్ళాడని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఫోన్ లో చివరిగా మాట్లాడామని తెలిపారు. కాగా పక్కా ప్లాన్ తోనే సంజయ్ ను రివిందర్, బాలాజి, రోహిత్ లు చెంపేసి ఉంటారని సంజయ్ తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. డబ్బుల కోసమే తమ కుమారుడిని హత్య చేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. తమ కుమారుడు ఆచుకిని కనుగొని తమకు న్యాయం చేయాలని సంజయ్ తల్లిదండ్రులు కోరుతున్నారు.