అన్నమయ్య జిల్లాలో రాయచోటి పట్టణం ట్రంక్ రోడ్ వద్ద ద్వి చక్ర వాహనచోదకుడు నాసిర్ (17) బైక్ పై వెళుతూ అదుపు తప్పికింద పడిపోయిన నాసిర్ పై అదే దారిలో వెళుతున్న బస్సు వెనుక భాగంలో టైరు అతని పై ఎక్కడంతో తీవ్ర గాయాలు పాలైన నాసిర్ అక్కడిక్కడే మృతి చెందాడు. పుంగునురు డిపోకు చెందిన ఆర్టీసి బస్సు మదనపల్లె నుంచి కడప కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయాచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాయచోటి పట్టణం మహబూబ్ నగర్ లో నివాసం ఉంటూ ద్విచక్ర వాహన మెకానిక్ గా పని చేస్తున్నట్లు వారి తల్లిదండ్రులు తెలియజేశారు. ప్రమాద సంఘటన పై కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ యస్ ఐ రఫీ పేర్కొన్నారు.
Crime
నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలంలోని ధర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందిన బస్సు అగ్ని ప్రమాదంకు గురైంది. నెల్లూరు నుండి విద్యుత్ కేంద్రానికి వెళ్తున్న సమయంలో బస్సులో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాణ భయంతో బస్సు అద్దాలు పగలగొట్టి, ధర్మల్ కేంద్రం ఉద్యోగులంతా సురక్షితంగా బయటపడ్డారు. పూర్తిస్థాయిలో బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ వద్ద గల కాకతీయ టెక్నో స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన స్థానికులు, స్కూల్ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. అగ్ని ప్రమాదం సంబంధించిన గదులలో పిల్లలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు అంటున్నారు. పాఠశాలలో ఫైర్ సేఫ్టీ మేజర్స్ లేవని, యాజమాన్యం నిర్లక్ష్యమే అగ్ని ప్రమాదానికి కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Read Also..
Read Also..
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరం పాడు గ్రామానికి చెందిన దుర్గమ్మ తన కూతురు కనిపించడం లేదని ఓబులవారిపల్లె పోలీసులను ఆశ్రయించింది. కూతురు అదృశ్యంపై పట్టించుకోలేదని ఆమె తెలిపారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న భాస్కర్ అనే పోలీస్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు. నా కూతుర్ని 20 వేలు డబ్బు తీసుకొని ప్రేమించిన వాడితో పోలీసులు పంపించారని దుర్గమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు పోలీస్ స్టేషన్కు తిప్పుకొని పోలీసులు న్యాయం చేయలేదన్నారు. తనపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ పై ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని బాదితురాలు విన్నవించారు.
Read Also..
విజయనగరం జిల్లా కొత్తవలస శారడ మెటల్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న కంపెనీలో ప్రమాదవశాత్తు గాయపడి తిమిడి గ్రామానికి చెందిన కార్మికుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయకుండా, సంఘటన సమాచారాన్ని బయటకి పొక్కకుండా కంపెనీ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. కార్మిక మరియు ప్రతిపక్ష నాయకులతో కలిసి కంపెనీ గేటు వద్ద మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని 50 లక్షల రూపాయలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కంపెనీలో కార్మికుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు చేసిన కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి. 20 ఏళ్ల విద్యార్థిని బంధించి, తీవ్రంగా హింసిస్తూ వీరు రాక్షసానందం పొందారు. దాదాపు 7 నెలల పాటు వారి రాక్షస క్రీడ కొనసాగింది. మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది.
20 ఏళ్ల బాధిత యువకుడిపై సత్తారు వెంకటేశ్ రెడ్డి, నిఖిల్, శ్రవణ్ లు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఓ రెస్టారెంట్ లో బాధిత యువకుడు మరో వ్యక్తికి ఎంతో బాధగా కనిపించాడు. దీంతో, ఆ వ్యక్తి బాధిత యువకుడిని కలిసి ఏదైనా సమస్య ఉంటే తనకు ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. దీంతో, ఈ ముగ్గురు తనను టార్చర్ చేస్తున్న విధానాన్ని వాట్సాప్ ద్వారా అతనికి తెలియజేశాడు. ఈ దారుణం గురించి తెలుసుకున్న ఆయన చలించిపోయి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఆ ముగ్గురు ఉంటున్న నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే పోలీసులు లోపలకు వచ్చేందుకు ఆ ముగ్గురు నిరాకరించారు. పోలీసులు వచ్చిన విషయాన్ని గ్రహించిన బాధితుడు వెంటనే వారి వద్దకు వచ్చి తన బాధలను చెప్పుకున్నాడు. తనను రక్షించాలని కోరాడు. అనంతరం ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. మానవ అక్రమ రవాణా, హింసించడం తదితర సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
కాకినాడ సముద్ర తీరంలో ఓ బోటులో జరిగిన అగ్నిప్రమాదంలో రూ. 80 లక్షల ఆస్తినష్టం సంభవించింది. వారం రోజుల క్రితం చేపలవేటకు సముద్రంలోకి వెళ్లిన బోటు తుపాను హెచ్చరికల నేపథ్యంలో మచిలీపట్టణానికి తిరుగుపయనమైంది. మరో నాలుగు గంటల్లో కాకినాడ చేరుకుంటుందనగా తెల్లవారుజామున ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే బోటులో ఉన్న సిలిండర్లు కూడా పెద్ద శబ్దంతో పేలిపోయాయి. అప్రమత్తమైన మత్స్యకారులు సముద్రంలోకి దూకేశారు. బోటు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న తీర రక్షక దళం సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బోటులోని 12 మంది జాలర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం కారణంగా దాదాపు రూ. 80 లక్షల ఆస్తినష్టం సంభవించినట్టు మత్స్యకారులు తెలిపారు.
అనుమానాస్పద స్థితి లో ఒక వ్యక్తి మృతి. గణపవరం మండలం కాల్చుపల్లి గ్రామానికి చెందిన ఈదుపల్లి వెంకటరామారావు(60) అనే వ్యవసాయ కూలీ మృతి. అదే గ్రామానికి చెందిన విశ్వనాథరాజు అనే రైతుకు ఇంటిదగ్గర చెట్లు పెరిగినవని నరకడానికి వెళ్లిన మృతుడు. గంట తర్వాత వెంకట రామారావు చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి యాక్సిడెంట్ అయిందని ఇంటికి ఫోన్ చేసి తెలియపరిచిన విశ్వనాథరాజు. మృతుని బంధువులు వచ్చేసరికి శవాన్ని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పెట్టి చనిపోయినాడు అని తెలియజేసిన విశ్వనాథరాజు. విశ్వనాథరాజు చెప్పే మాటలకు సంబంధం లేదని ఒకసారి ముందుకు పడిపోయారని ఒకసారి వెనకకు పడిపోయాడని ఒకసారి ఆక్సిడెంట్ అయిందని చెప్పడం ఈ కేసు అనుమానాస్పద మృతిగా గుర్తించారు. మృతుడికి ముగ్గురు మగ పిల్లలు భార్య ఉన్నారు. తరచుగా రాజుగారి దగ్గర పనికి వెళుతూ వస్తూ ఉంటారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా పట్టను పోలీసులు.
నగరంలో వరస అగ్ని ప్రమాదం తో ప్రజలు భయభ్రాంతులు. ఫిషింగ్ హార్బర్ గంగలమ్మ గుడి వద్ద ఎగసిపడిన మంటలు. సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై వివరాల ఆరా తీసిన పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్. ఫిషింగ్ హార్బర్ వద్ద గాంధీ విగ్రహం వద్ద బడ్డీలు నుంచి ఎగసిపడుతున్న మంటలు. ప్రమాదం పై ఆరా తీస్తున్న విశాఖ పోలీసులు. వరుస అగ్ని సంఘటనలతో భయబ్రాంతులకు గురవుతున్న విశాఖ వాసులు. చేపల వేటకు సంబంధించినవన్ని బూడిద పాలు అయ్యాయని మత్స్యకారులు ఆవేదన. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక శాఖ.
కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై ఏడుగురు తో కత్తిపూడి నుండి ఏవి నగరం వెళ్తున్న ఆటోను ఓ లారీ డీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి గంపల చందర్రావు( 65 ) అక్కడికక్కడే మృతి చెందారు. ఐదుగురుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ లో నలుగురు ని తుని ఏరియా ఆసుపత్రికి, ఇద్దరిని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.