రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్ లో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 40 వేల రూపాయల నగదు, తులం బంగారం దొంగతనం చేశారు. తిప్పాపూర్ లోని గురుకుల పాఠశాలలో ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఎలక్షన్ డ్యూటీలో వెళ్లిన సమయంలో చోరీ జరిగినట్లు తెలుస్తుంది. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడే ముందు సిసి కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా, క్లూస్ టీం రంగంలోకి ఆధారాలు సేకరిస్తుండగా, దొంగ తెలివిగా తన చేతికి గ్లౌజులు వేసుకోవడంతో వేలిముద్రలు సేకరించడంలో కష్టతరంగా మారింది.
Crime
కడప జిల్లా.. అట్లూరు మండలంలోని కోనరాజుపల్లె పాఠశాల గేటుకు ఉరేసుకుని గంపల చిన్న ఎల్లయ్య అనే (37) వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లయ్య మృతి పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అట్లూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో ని గణేష్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు గోవులకు రొట్టెలు వేస్తుండగా, ఎదురుగా ఉన్న థామస్ అనే వ్యక్తి మా ఇంటి ముందు వేస్తావా? అని గొడవకు దిగి మహిళ అని చూడకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు అసభ్య పదజాలం తో తిట్టడం తో అది గమనించిన ఆమె కుమారుడు విజయ్ మా అమ్మ ను తిడతావా అని అడిగే లోపే, లోపలికి వెళ్లి కత్తి తో బయటకు వచ్చి కడుపు కింద భాగంలో పొడిచేయడమే కాక, ఇది నా రోడ్, ఇక్కడ ఆవులకు మళ్ళీ ఒకసారి ఏదైనా పెడితే అందరిని చంపేస్తా అని బెదిరించి లోపలికి వెళ్లి పోయాడు. విషయం తెలుసుకున్న బోయిన్ పల్లి పోలీస్ లు థామస్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాల్పుల విరమణ ఆగిపోవడంతో గాజా లో మళ్లీ ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం ఇరుపక్షాలను కోరినా వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి. దీంతో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 178 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు హమాస్ బందీల్లో ఐదుగురు చనిపోయినట్లు మిలిటెంట్ గ్రూప్ ధ్రువీకరించింది. ఈ దాడులతో గాజాలో మళ్లీ ఆసుపత్రుల్లో దారుణపరిస్థితులు ఏర్పడుతాయని యూఎన్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశాయి. కాల్పుల విరమణ ఆగిపోవడంతో గాజా లో మళ్లీ ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం ఇరుపక్షాలను కోరినా వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి. దీంతో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 178 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు హమాస్ బందీల్లో ఐదుగురు చనిపోయినట్లు మిలిటెంట్ గ్రూప్ ధ్రువీకరించింది. ఈ దాడులతో గాజాలో మళ్లీ ఆసుపత్రుల్లో దారుణపరిస్థితులు ఏర్పడుతాయని యూఎన్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశాయి. మరోవైపు హమాస్ బందీల్లో ఐదుగురు చనిపోయిన విషయాన్ని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. మృతుల కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. ఒకరి మృతదేహాన్ని గుర్తించి ఇజ్రాయెల్కు తరలించామని తెలిపింది. ఇంకా హమాస్ బందీల్లో 136 మంది ఉన్నారని, వారిలో 17 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డానియెల్ హగారీ పేర్కొన్నారు. కాల్పుల విరమణ సమయంలో హమాస్ తమ చెరలో ఉన్న 100 మంది బందీలను విడుదల చేయగా, ఇజ్రాయెల్ తమ దేశ జైళ్లలో ఉన్న 240 మంది పాలస్తీనా వాసులను విడుదల చేసింది. అక్టోబర్ 7న హామాస్ ఇజ్రాయెల్పై దాడికి దిగి పెను విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనలో 1200 మంది ఇజ్రాయెల్ వాసులు చనిపోయిన విషయం తెలిసిందే. అనంతరం ఇజ్రాయెల్ గాజాలో వైమానిక దాడులకు దిగడంతో సుమారు 15,000 మంది పాలస్తీనా పౌరులు మృతిచెందారు.
తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల లో బి.కామ్ చదువుతున్న విద్యార్థి ఎస్.జితేంద్ర కుమార్ ను విజిలెన్స్ అధికారులు చితక బాధడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణానికి కారణమైన విజిలెన్స్ అధికారులు, ప్రిన్సిపల్ ను తక్షణమే అరెస్ట్ చేసి విధుల నుండి తొలగించి, విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఎ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.మాధవ్ డిమాండ్ చేశారు. కళాశాల వద్ద శుక్రవారం రాత్రి ధర్నా నిర్వహించారు. విజిలెన్స్ అధికారులు చితకబాది అతని దగ్గర నుండి బలవంతంగా క్షమాపణ లేఖ రాయించుకున్నారని అన్నారు.
గజపతినగరం జాతీయ రహదారి పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంపై విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రామస్వామి (45) గా గుర్తింపు.. పద్మభనాభం మండలం నుండి ఇటుకలు వ్యాను తీసుకొని గజపతినగరం వచ్చిన రామస్వామి… ఇటుకలు అన్ లోడ్ చేసిన అనంతరం మూడవ అంతస్థు పైకి ఎక్కడం తో సమీపంలో గల 11 కేవి విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు.
ఎక్సైజ్ సీఐ కొడుకు నిర్లక్ష్యం ఒక మహిళ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. హనుమకొండ జిల్లా ఖాజీపేటలో ఈ ఘటన జరిగింది. స్థానిక ఫాతిమానగర్కు చెందిన మహిళ స్కూటీ ఎక్కుతుండగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద సమయంలో ఎక్సైజ్ సీఐ శరత్ కుమారుడు వంశీ కారును నడుపుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల నుంచి తమ ఫిర్యాదును తీసుకోవడం లేదంటూ ఫాతిమానగర్ జంక్షన్లో ధర్నా చేపట్టారు. భారీగా ట్రాఫిక్ జాం కాగా.. పోలీసులు తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని వారు తేల్చిచెప్పారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్ భాస్కర్రెడ్డికి ఇచ్చిన ఎస్కార్ట్ బెయిల్ గడువు ముగియటంతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు. అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భాస్కర్రెడ్డికి సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన సెప్టెంబరు 22 నుంచి నవంబరు 30 వరకు ఎస్కార్ట్ బెయిల్పై ఉన్నారు. గడువు ముగియడంతో శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈనెల 20 వరకు సీబీఐ కోర్టు రిమాండ్ విధించడంతో సీబీఐ అధికారులు భాస్కర్రెడ్డిని చంచల్గూడ జైలుకు తరలించారు.
ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు సున్యం. అందుబాటులో ఉండని డ్యూటీ డాక్టర్లు. కలవపాముల గ్రామనికి చెందిన వనం శాంతి ప్రియ(37) పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది వెంటనే ఆవిడను ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, అత్యవసర సేవల విభాగంలో ఉన్న నర్సులు డాక్టర్కు ఫోన్ చేసి, అతను చెప్పిన విధంగా వైద్యం అందించారు. డాక్టర్ లేకుండా నర్స్ లు వైద్యం చెయ్యడం పై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల తర్వాత డ్యూటీ డాక్టర్ హుటాహుటిన ఆసుపత్రికి వచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హనుమకొండ జిల్లా కాజిపేట్ లో నిన్న గ్యాబ్రియల్ స్కూల్ నుండి బయటికి వచ్చి బైక్ ఎక్కుతున్న కవితను కారు ఢీకొట్టింది. కారు నెంబర్ TS03 FA9881. మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. కారు ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎక్సయిజ్ సిఐ శరత్ కొడుకు వంశీ. నిన్నటి నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తమకు న్యాయం చేయడం లేదని మృతురాలి బంధువుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ అధికారి కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, కవిత బంధువులు మరియు స్నేహితులును తిట్టి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్లగొడుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఫాతిమా నగర్ జంక్షన్లో ధర్నా చేపట్టారు.