భీమవరం పంచాయతీ సచివాలయం 2 దగ్గర సెప్టిక్ ట్యాంక్ లో ప్రమాదవశాత్తు వారం రోజుల క్రితం గుంటలో పడి మరణించిన శెట్టిపల్లి సాకేత్ డెడ్ బాడీని శనివారం భీమవరం గ్రామపంచాయతీ స్మశానంలో శవాన్ని రిపోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఈ పోస్ట్ మాస్టర్ సందర్భంగా కందుకూరు సిఐ. నఫీజ్ భాష ఉలవపాడు ఎస్ఐ బాజీ రెడ్డి ఎంపీడీవో చెంచమ్మ, ఎమ్మార్వో బ్రహ్మయ్య, వీఆర్వోలు, ఉపాధి హామీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఆ బాలుడు చనిపోక ముందే ఆ గుంటలపై జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు సాకేత్ మరణించేవాడు కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల సాకేత్ మరణం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని అర్థం అవుతుంది. మరణానికి కారుకులైన అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకొని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ఆర్ మోహన్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే ఒక దళిత బాలుడు ప్రాణాలు కోల్పోయాడని, బిడ్డను కోల్పోయిన కుటుంబాన్ని ఒక అధికారి కూడా సందర్శించి సానుభూతి తెలియజేయలేదని, అంత అమానవీయంగా అధికార యంత్రాంగం వ్యవహరించిందని, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం జనాలకి నిద్ర పట్టకుండా ఓట్ల వేట్ల కొనసాగించే అధికార ప్రతిపక్ష నాయకులు ఆదుకునేందుకు ఇంటికి రాలేదని ఆర్ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Crime
సుండుపల్లి మండలం బెస్తపల్లి దగ్గర ఆగి ఉన్న ద్విచక్ర వాహన దారుడు రామచంద్ర నాయక్ ను తిరుపతి నుంచి సుండుపల్లికి వస్తున్న ఆర్టిసి బస్సు డి కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రామచంద్ర నాయక్ ను ఆసుపత్రికి తరలించేందుకు 108 కు ఫోన్ చేసినప్పటికీ సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోకలేక పొయ్యింది. మానవత స్వచ్చంద సంస్థ వారికీ చరవాణి ద్వారా సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన మానవత అంబులెన్స్ చోదకుడు చంటి ప్రమాద సంఘటన స్థలానికి చేరుకొని రామచంద్ర నాయక్ ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వారికీ ప్రాధమిక వైద్య సేవలు అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళ్లాలంటూ సూచించారు. ప్రమదం జరిగిందని సమాచారం ఇచ్చిన వెను వెంటనే సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని ఆసుపత్రికి చేర్పించిన మానవత సభ్యులకు, అంబులెన్స్ చోదకుడు కి వారి కుటుంబ సభ్యులు స్థానికులు ప్రసంసాభినందనలు తెలియజేశారు. గాయపడిన రామచంద్ర నాయక్ డి వాయిల్ దొడ్డి బిడికి గా పోలీసులు గుర్తించారు. సుండుపల్లి పోలీసులు జరిగిన సంఘటన పై కేసు నమోదు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్ లో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి 40 వేల రూపాయల నగదు, తులం బంగారం దొంగతనం చేశారు. తిప్పాపూర్ లోని గురుకుల పాఠశాలలో ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఎలక్షన్ డ్యూటీకి వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడే ముందు సిసి కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..
Read Also..
విశాఖ దండు బజార్ జగదాంబ సెంటర్లో దారుణం. సిద్ధార్థ హాస్పటల్ లో కాసులకు కక్కుర్తి పడి గుట్టుచప్పుడుగా అబార్షన్లు కొనసాగుతున్నాయి. విశాఖ సిద్ధార్థ హాస్పిటల్ దాస్టికాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేస్తున్నారు. 50వేల రూపాయలు తీసుకొని ఆరు నెలల గర్భవతి కి అబార్షన్ చేసిన వైనం చోటుచేసుకుంది. దారుణంగా పసికందును ప్లాస్టిక్ కవర్లో పెట్టి స్మశాన వాటికకు తరలించారు. సిద్ధార్థ ఆసుపత్రి వార్డ్ బాయ్ సహకారంతో పసికందుకు దహన సంస్కారాలు చేపట్టారు. సిద్ధార్థ ఆసుపత్రిలో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న అక్రమ కార్యకలాపాలు, భారతి అనే గర్భిణీకి మత్తుమందు ఇచ్చి అబార్షన్ చేసిన వైద్యులు, బాధితురాలు భారతి సివిఆర్ న్యూస్ ని ఆశ్రయించింది.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నర్సాపేటలో పలువురు సీఎం ఇంటి వద్ద ఆత్మహత్యయత్నం చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి తమ ఆస్తులు లాక్కొని మోసం చేశాడంటూ పెట్రోల్ బాటిల్ ను చేతిలో పట్టుకుని వాపోయారు బాధితులు. పోలీసులు వారిని అడ్డుకుని, పెట్రోల్ బాటిల్ ను లాక్కున్నారు. దీంతో తమకు నాయ్యం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం బైపాస్ రోడ్డు సమీపంలో పార్వతీపురం నుండి విజయనగరం వైపు వస్తున్న లారీ, అంబటివలస నుండి గొట్లాం వైపు సైకిల్ పై వెళ్తున్న తాళ్లపూడి బుచ్చినాయుడు(55)ను వెనుక నుండి ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే సైకిలీస్ట్ మృతి చెందారు. బొండపల్లి పోలీసులు సమాచారం తెలుసుకొని సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు.
కడప జిల్లా… ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడు బెనర్జీ పై అక్టోబర్ 28 వ తేదీనా జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన ముద్దాయిలైన భరత్ కుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిలను మూడవ పట్టణ ఇన్స్పెక్టర్, సిబ్బంది అరెస్టు చేసినట్లు ఇన్చార్జి డిఎస్పి నాగరాజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. బెనర్జీ పలుమార్లు ముద్దాయిలను బెదిరించినట్లు, పథకం ప్రకారం సాధికార సామాజిక బస్సుయాత్ర లో అదును చూసుకుని ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గాంధీ రోడ్డుపై బెనర్జీని ముద్దాయిలైన రామ్మోహన్ రెడ్డి భరత్ కుమార్ రెడ్డిలు అతని బైకును ఢీ కొట్టి, అందుబాటులో ఉన్న కొడవలితో దాడి చేయడంతో పాటు హత్యా ప్రయత్నం చేసి.. అనంతరం బైకుపై పరారయ్యారని వెల్లడించారు. శనివారం ఉదయం వీరి అరెస్టును ధ్రువీకరించిన డిఎస్పి, భరత్ కుమార్ రెడ్డి వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు రెండు సిమ్ కార్డులు, రామ్మోహన్ రెడ్డి వద్ద నుండి ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు నిందితులు సెల్ఫోన్లు సిమ్ కార్డులు కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. రాయచోటికి చెందిన సిద్ధారెడ్డి అనే వ్యక్తి అలాగే మరికొందరు ముద్దాయిలకు సహకరించి వారికి వాహనాలు, ఆర్థిక సాయం చేసినట్లు తమ విచారణలో తేలిందని, త్వరలో వారిని కూడా విచారించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముద్దాయిలను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ అలాగే సిబ్బందిని డిఎస్పీ నాగరాజు అభినందించారు. అలాగే ముద్దాయిలను రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
సోమవారం భీమవరం పంచాయతీ సచివాలయం 2 దగ్గర సెప్టిక్ ట్యాంక్ గుంటలో ప్రమాదవశాత్తు పడి మరణించిన శెట్టిపల్లి సాకేత్ సన్నాఫ్ ఖాదర్ బాషా శవం శనివారం భీమవరం గ్రామపంచాయతీ స్మశానంలో పోస్ట్ మార్టం జరిగింది. ఈ పోస్ట్ మార్టం సందర్భంగా కందుకూరు సిఐ. నఫీజ్ భాష ఉలవపాడు ఎస్ఐ బాజీ రెడ్డి, ఎంపీడీవో చెంచమ్మ, ఎమ్మార్వో బ్రహ్మయ్య, వీఆర్వోలు, ఉపాధి హామీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఆ బాలుడు చనిపోక ముందే సెప్టిక్ ట్యాంకి పైన ముల్లకంప వేసి ఉంటే ఈరోజు సాకేత్ మరణించేవాడు కాదు అందువల్ల సాకేత్ మరణం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని అర్థం అవుతుంది. మరణానికి కారుకులైన అధికారులు పైన, సాకేత్ మరణానికి కారుకులైన అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకొని బాధ్యత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ఆర్ మోహన్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే ఒక దళిత బాలుడు ప్రాణాలు కోల్పోయాడని బిడ్డను కోల్పోయిన కుటుంబాన్ని ఒక అధికారి కూడా సందర్శించి సానుభూతి తెలియజేయలేదని అంత అమానవీయంగా అధికార యంత్రాంగం వ్యవహరించిందని అదే సందర్భంలో ఎన్నికల సమయంలో ఓట్ల కోసం జనాలకి నిద్ర పట్టకుండా ఓట్ల వేట్ల కొనసాగించే అధికార ప్రతిపక్ష నాయకులు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు రాలేదని ఆర్ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం గ్రామానికి చెందిన శాఖ నాగ దుర్గ ప్రసాద్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు అదే గ్రామానికి చెందిన బత్తుల వెంకటేష్ అనే అధికార పార్టీకి చెందిన యువకుడు, టేకులబోరు గ్రామంలోని ఓ కిరాణా షాపుకు వచ్చిన నాగ దుర్గ ప్రసాద్ కు అక్కడే షాపు వద్ద ఉన్న బత్తుల వెంకటేష్ అనే యువకుడికి మధ్య మాట మాట రావడంతో వెంకటేష్ అనే యువకుడు షాపులో ఉన్న పెట్రోల్ బాటిల్ తీసుకొని దుర్గ ప్రసాద్ పై పోసి వెంటనే నిప్పు అంటించడంతో పక్కనే షాపులో ఉన్న మరో వ్యక్తి మంటలు ఆర్పీ బాడుతుడను ఆసుపత్రికి తరలించారు, బాధితుడు సోదరి మాధివి జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశానని అవతలి వ్యక్తి అధికార పార్టీ యువకుడు కావడంతో కేసులో పోలీసులు జాప్యం చేస్తున్నారని ఆరోపించింది, కేసు గత నెల 18 వ తేదీన ఘటన జరిగితే 21 వ తేదీ వరకు FIR నమోదు చేయలేదని బాధితుడి అక్క ఆరోపించింది పైగా అతనిపై ఏదో సెక్షన్ మీద కేసు నమోదు చేసి వాళ్ళతో రాజీపడమని పోలీసులు పదే పదే చెప్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు, విషయం ఆలస్యంగా బయటకు రావడంతో స్థానిక తెలుగుదేశం నాయకులు యడవల్లి భాస్కర్, బరపారి ప్రకాష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు సున్యం, డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. కలవపాముల గ్రామనికి చెందిన వనం శాంతి ప్రియ(37) పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం కు ప్రయత్నించింది. హుటాహుటిన ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సేవల విభాగంలో నర్సులు డాక్టర్ కు ఫోన్ చేసి, డాక్టర్ చెప్పిన విధంగా వైద్యం అందించారు. డాక్టర్ లేకుండా నర్సులు వైద్యం చెయ్యడం పై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల తర్వాత డ్యూటీ డాక్టర్ హుటాహుటిన ఆసుపత్రికి రావడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.