ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతుండడం రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న వలసలు బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఎప్పుడు ఎవరు వెళ్లిపోతారో తెలియక గందరగోళం నెలకొంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి హస్తం కండువా కప్పుకోవడం ఆ పార్టీని షాక్ కు గురి చేసింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన గులాబీ ఎమ్మెల్యేలు , ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబును కలవడం హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామని వారు చెబుతున్నారు.. కాంగ్రెస్ లోకి చేరేందుకే భేటీ అయ్యారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ వివేకానంద మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి సెక్రటేరియట్లో మంత్రి శ్రీధర్ బాబు తో భేటీ అయ్యారు. వీరిలో అరికెపూడి గాంధీ, వివేకానంద, కృష్ణారావులకు గతంలో టీడీపీ తో అనుబంధం ఉంది. సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలకు గతంలో కాంగ్రెస్తో అనుబంధం ముంది. ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి ప్రభుత్వంలో కీలకమైన మంత్రిని సెక్రటేరియట్ లో కలవడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నుంచి అన్ని రకాల హామీలు లభిస్తే, నేడో, రేపో ఆ ఎమ్మెల్యేలు కూడా హస్తం కండువా కప్పుకోవచ్చనే చర్చ జరుగుతున్నది. అయితే అభివృద్ధి కోసమే తాము మంత్రిని కలిశామని సదరు ఎమ్మెల్యేలు చెబుతున్నా, చేరికలపై వస్తున్న వార్తలను వారు ఖండించకపోవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. మరోవైపు ఆయా ఎమ్మెల్యేలు శనివారమే సీఎం సమక్షంలో పార్టీలో చేరాల్సి ఉన్నదని, కానీ ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రుల మీటింగ్ నేపథ్యంలో వాయిదా పడిందనే చర్చ కూడా గాంధీభవన్ లో జరుగుతుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందనదేశానికి అన్నం పెట్టే అన్నదాత.. ఇప్పుడు అడుగడుగునా దగా పడుతున్నాడు. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థించిన ఆ కళ్లు.. ఇప్పుడు గిరిజన సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో అన్నదాతల పరిస్థితి…
- వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.రాష్ట్రంలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికారులకు, విత్తన కంపెనీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని,…
- ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది ? ప్రభుత్వ పరం అయిన…
- చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు.‘ఆపరేషన్ దేవ్’ పేరిట గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.ఈ కేసులో భాగంగా తెలంగాణలో మురుగన్ అలియాస్ నాగరాజు గ్యాంగ్ను గుజరాత్ పోలీసులు…
- ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 61418