319
మహిళలైన అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, సమస్యలను పరిష్కరించాలని నరసాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ సెంటర్ లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు 4వ రోజుకు చేరాయి. బండారు మాధవ నాయుడు అంగన్వాడీ వర్కర్లకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలైనా అంగన్వాడీ వర్కర్లపై నిర్లక్ష్య ధోరణి విడనాడాలని న్యాయమైన వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరంకుశ వైఖరిని విడనాడి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో అంగన్వాడీలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.





Total views : 80429