ఒంగోలు జిల్లా(Ongole) ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇచ్చారని, కానీ మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు ఇచ్చామని తెలిపారు. పేదల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదని విమర్శించారు. మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగిందన్నారు.
500గ్యాస్ , గృహ జ్యోతి పథకాలపై రేవంత్ కీలక ప్రకటన
రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కులు కల్పించామని జగన్ తెలిపారు. భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదన్నారు. పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టామన్నారు. వైద్య రంగంలో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని సీఎం జగన్ తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 90764