రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగేడ గ్రామంలోని ప్రధాన రహదారి పై ఏర్పడ్డ గుంతల వద్ద జనసేన మరియు టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జనసేన మరియు టీడీపీ నాయకులు రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో మోటార్ సైకిళ్లను పడేసి వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధిని విస్మరించిన అసమర్థ సీఎం జగన్ను సాగనంపేందుకు సమయం దగ్గర పడిందని వారు తెలిపారు. అసమర్థుడైన పాలకునికి రాష్ట్రం అప్పగిస్తే ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలంతా గమని స్తున్నారన్నారు. ఏ మూలకు వెళ్లినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. సైకో ప్రభుత్వాన్ని పారదోలి చంద్రబాబు, పవన్కల్యాణ్ల నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సైకో ప్రభుత్వాన్ని పారదోలాలి..
231
previous post





Total views : 78439