Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh ఏపీ విమాన ప్రయాణికులకు శుభవార్త

ఏపీ విమాన ప్రయాణికులకు శుభవార్త

by Rama
ఏపీ విమాన ప్రయాణికులకు శుభవార్త

విమాన ప్రయాణికులకు పౌరవిమానాయాన శాఖ ఓ శుభవార్త అందించింది. విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణాలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విశాఖ టు విజయవాడ మధ్య ఒక్క సర్వీసు మాత్రమే రాకపోకలు సాగిస్తోంది. దాంతో ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్‌లు అవుతున్నాయి.

అందుకే కొత్తగా మరో రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ రాజారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల విమాన సర్వీసులను నేడు (ఆదివారం) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్‌నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ తెలిపారు.

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసు ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. 10.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు (విజయవాడ) చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55 గంటలకు విజయవాడలో బయలుదేరుతుంది. అదేరోజు రాత్రి తొమ్మిది గంటలకు విశాఖపట్నం చేరుతుంది. మరో ఫ్లైట్ సర్వీసు అయిన ఇండిగో విమానం రాత్రి 7.15 గంటలకు విజయవాడలో బయలుదేరుతుంది. రాత్రి 8.20 గంటలకి విశాఖపట్నం చేరుతుంది.

అదే సర్వీసు తిరిగి రాత్రి 8.45 గంటలకు విశాఖలో బయలుదేరి 9.50 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఈ రెండు కొత్త విమాన సర్వీసులతో కలిపి విశాఖ టు విజయవాడ మధ్య తిరిగే ఫ్లైట్ సర్వీసుల సంఖ్య మూడుకు చేరింది. ఈ ఫ్లైట్‌ సర్వీసులతో విశాఖ టు విజయవాడ మధ్య ప్రయాణించే వారి ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
  • యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
    హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
  • ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
    ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039479
Total views : 197054

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: