తెలంగాణ TET కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు విద్యాశాఖ కీలక అప్ డేట్ జారీ చేసింది. ఆన్ లైన్ దరఖాస్తులు నవంబర్ 20 బుధవారం అర్ధరాత్రితో ముగిసింది. టెట్కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,75,773 దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వీటిల్లో పేపర్ 1 పరీక్షకు 94,335 దరఖాస్తులు, పేపర్ 2 పరీక్షకు 1,81,438 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది. ఇక దరఖాస్తు వివరాల్లో పొరపాట్లు సవరించుకునేందుకు కూడా విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ఈ అవకాశం నేటితో గడువు ముగియనుంది. ఈ మేరకు అర్ధరాత్రి లోగా వివరాలు సవరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ టెట్ హాల్ టికెట్లు డిసెంబర్ 26న విడుదలవుతాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జనవరి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరుగుతాయి.
ప్రతి రోజు రెండు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నాం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇక టెట్ ఫలితాలు ఫిబ్రవరి 5వ తేదీన వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. టెట్ పరీక్షలో మొత్తం రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. ఒక్కో పేపర్ 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. OC అభ్యర్థులకు 90 మార్కులు, BCలకు 75 మార్కులు , SC 60 మార్కులు సాధిస్తే టెట్లో ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. TET లో అర్హత సాధించిన వారికి మాత్రమే DSC రాసేందుకు అవకాశం లభిస్తుంది. టెట్ పరీక్షల్లో వచ్చిన మార్కులకు డీఎస్సీ నియామకాల్లో 20 శాతం వెయిటేజ్ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే కొత్త DSC నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి