శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలోని జడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ వద్ద మధ్యాహ్నం భోజనం సరిగా వడ్డించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. పాఠశాలో దాదాపు 400 మంది విద్యార్థులు ఉండగా.. 150 మంది దాకా విద్యార్థులు ఇంటి నుంచి రోజూ బాక్సులు తీసుకొచ్చి తింటున్నారు. మధ్యాహ్న భోజనం చాలీచాలకుండా పురుగులు పడిన అన్నం వడ్డిస్తున్నారని.. అందుకే ఇంటినుంచి భోజనం తెస్తున్నామని విద్యార్థులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం మెనూ ప్రకారం కూరగాయల అన్నం, కుర్మా వడ్డించాలి. అయితే ముద్దముద్దగా అన్నం, నీళ్ల సాంబార్ లాగా కురుమ ఉండడంతో విద్యార్థులు తినకుండా చెత్తబుట్టలోకి వేయడం బాధాకరం. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ స్కూల్ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించడం లేదని విద్యార్థులు వాపోతూన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని వారు కోరారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్లోని గండిపేట భూకబ్జా యత్నం కేసులో దర్యాప్తు..నకిలీ జీఓలు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు యత్నించిన అంతర్రాష్ట్ర భూ దందా ముఠాను పోలీసులు ఛేదించారు. పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో భూదందా గుట్టు వెలుగులోకి వచ్చింది. గండిపేట పరిధిలోని సర్వే నెంబర్ 18లో గల…
- హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్..అనకాపల్లి జిల్లా పరవాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ కె.వి. రమణపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను పరవాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఇటీవల అర్ధరాత్రి సమయంలో హోంగార్డ్ కె.వి. రమణపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో…
- నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం..నెల్లూరు జిల్లా గూడూరు మండలం మనుబోలు జాతీయ రహదారిపై కాగితాలపూరు సర్కిల్ వద్ద ఒక మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది . ఈ సంఘటన స్థానికంగా…
- నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు..నెల్లూరు జిల్లా సంగం మండలంలో భారీ ఈదురు గాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మర్రిపాడు, జంగాల కండ్రిక గ్రామాల్లో భారీ గాలుల వీచడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తలుపురుపాడు, తరుణవాయి, కొరిమెర్ల, జంగాల కండ్రిక గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి,…
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మేడిశెట్టి వారి పాలెంలో తీవ్ర గాలి దుమారం ..ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మేడిశెట్టి వారి పాలెం గ్రామ శివారులో ఆదివారం భారీ వర్షం, ఈదురుగాలులు తీవ్ర నష్టాన్ని కలిగించాయి . బలమైన గాలుల ధాటికి ఓ ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోయింది. సుమారు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90150