Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది…

గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది…

by Prakash
tdp-janasena rally

గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది అంటూ పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో టిడిపి- జనసేన పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. దాచేపల్లి పట్టణం నుంచి కేసానుపల్లి వరకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎటువంటి రోడ్లు వేయలేదన్నారు. దీంతో రోడ్లన్నీ గుంతలమయం అయిపోయాయని ఎద్దేవా చేశారు. ఈ గుంతల రోడ్ల మీద ప్రయాణిస్తూ , ఎంతో మంది యువకులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి తన బిడ్డను చూడటానికి వెళ్తూ… రోడ్డు ప్రమాదంలో మరణించాడని, ఇలా ఏన్నో కుటుంబాలు ప్రమాదం బారిన పడి రోడ్డున పడ్డాయన్నారు. ఇప్పటికైనా ఈ కళ్ళు లేని కబోది , మూగ వైసీపీ ప్రభుత్వం రోడ్లని బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Advertisements

You may also like

Our Visitor

009385
Total views : 62186

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.