ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సర్కారు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం భవనం పై భారీ బెలూన్ ను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలకు ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలతో వినూత్నంగా గ్యాస్ బెలూన్ ను ఏర్పాటు చేశారు. ‘నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను’ అనే నినాదాన్ని ఆ బెలూన్ పై రాశారు. ఈనెల 30న గురువారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు దానిపై పేర్కొన్నారు. భారీ సైజుతో ఎత్తులో ఉన్న ఈ బెలూన్ అందరిని ఆకట్టుకుంటుంది. అలాగే రామగుండం నియోజకవర్గంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల వద్ద ఓటు హక్కు వినియోగించుకోవాలని విషయంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను ఆకట్టుకున్న గ్యాస్ బెలూన్..
234
previous post




Total views : 62311