నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ అనుముల మండల ఐటిఐ కాలేజ్ లో జిల్లా కలెక్టర్ ఆర్జీవి కర్ణన్ మాట్లాడుతూ 299 పోలింగ్ స్టేషన్లో సిబ్బంది ఈవీఎం ఏర్పాట్లు చేయడం జరిగింది. వెహికల్స్ కూడా రావడం జరిగింది ఆఫ్టర్ లంచ్ తర్వాత పోలింగ్ స్టేషన్ లో వెళ్లడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్టర్ అన్ని ఏర్పాట్లు మంచినీళ్లు భోజనం సదుపాయాలు చేయడం జరిగింది. రేపు అతి ముఖ్యమైన రోజు 30 తారీకు పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తప్పకుండా ఓటు వేయాలని కోరుకుంటున్నాను.
election officer
రేపటి ఎన్నికల పోలింగ్ కోసం హైదరాబాద్ లో పోలింగ్ ఏర్పాట్లను, డిఆర్ సి సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ పరిశీలించారు. గోషామహల్ నియోజక వర్గ డి అర్ సి సెంటర్ కోటి మహిళ కాలేజీ లో బహదూర్ పూర నియోజక వర్గం డి అర్ సి సెంటర్ అరోరా లీగల్ అకాడమీ లో పరిశీలించిన తర్వాత సెక్టార్, అధికారులు పోలింగ్ అధికారులకు సిబ్బంది పాటించ వలసిన ఎన్నికల నిభందనలు వివరించారు. అదే విధంగా ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ నియోజక వర్గాలకు సంబంధించి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డి అర్ సి సెంటర్ పరిశీలించారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛననీయ సంఘటనలు జరగకుండా పగడ్భందీగా ఏర్పాట్లు చేశామని రోనాల్ట్ రాస్ అన్నారు.
ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సర్కారు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం భవనం పై భారీ బెలూన్ ను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలకు ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలతో వినూత్నంగా గ్యాస్ బెలూన్ ను ఏర్పాటు చేశారు. ‘నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను’ అనే నినాదాన్ని ఆ బెలూన్ పై రాశారు. ఈనెల 30న గురువారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు దానిపై పేర్కొన్నారు. భారీ సైజుతో ఎత్తులో ఉన్న ఈ బెలూన్ అందరిని ఆకట్టుకుంటుంది. అలాగే రామగుండం నియోజకవర్గంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల వద్ద ఓటు హక్కు వినియోగించుకోవాలని విషయంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలీస్, పి.ఓ పోలింగ్ అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు జిల్లాలోని 15 నియోజకవర్గాలలో ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలలో ఎన్నికల విధులు నిర్వహించే పి.ఓ లు, ఏ.పి.ఓ లు, ఇతర పోలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఆయా నియోజకవర్గాల్లో సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలీసు అధి కారికారులు, సిబ్బంది ఆయా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటు వేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట్ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ను పరిశీలించారు. అదే విధంగా కార్వాన్ నియోజకవర్గం గోల్కొండ తహశీల్దార్ కార్యాలయం, చార్మినార్ నియోజకవర్గం మొఘల్ పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్, బహదూర్ పుర నియోజకవర్గం బహదూర్ పుర తహశీల్దార్ కార్యాలయం ఫెసిలిటేషన్ సెంటర్ లలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను పరిశీలించారు.





Total views : 149554