ఏపీ న్యాయవ్యవస్థలో ఇవాళ ఓ కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ లీసా గిల్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆమె పంజాబ్-హర్యానా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా సేవలందిస్తూ నిష్పాక్షిక తీర్పులకు పేరుగాంచారు. అయితే, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు రిటైర్ అవ్వడానికి రెండు నెలల ముందే వారి వారసులను ఖరారు చేయాలని కొలీజియం నిర్ణయించింది. న్యాయపాలనలో జాప్యాన్ని నివారించేందుకు ఈ సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి ఓ మహిళా న్యాయమూర్తి సారథ్యం వహించనుండటం పట్ల న్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కీలక కేసులు, న్యాయ పరిపాలన అంశాలపై ఆమె రాకతో వేగం పుంజుకోనుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
హైకోర్టు సీజేగా ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ లీసా గిల్ ..
38



Total views : 54814