Sunday, April 26, 2026
News Navigation
Sunday, April 26, 2026
News Navigation

Breaking

Sunday, April 26, 2026
Home Andhra Pradesh జగన్ రాయలసీమ ద్రోహి- టీడీపీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

జగన్ రాయలసీమ ద్రోహి- టీడీపీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

by Prakash
Someshetty Venkateshwarlu on Jagan's visit to Kurnool

కర్నూలు(Karnool) న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపనకు సీఎం జగన్…

సీఎం జగన్ ఈ నెల 4వతేదిన కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కర్నూలుకు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారంటూ టీడీపీ(TDP) రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కర్నూలు న్యాయం రాజధానిగా చేసి హైకోర్టు ఏర్పాటు చేస్తానని మాయ మాటలు చెప్పి మాట తప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ రాజధాని చేస్తానని చెప్పి ఇపుడు కొత్తగా న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్ కర్నూలు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ రాయలసీమలో పుట్టి రాయలసీమ వాసులనే మోసం చేస్తూ రాయలసీమ ద్రోహిగా మారారని అన్నారు. ఇక పై ప్రజలు సీఎం జగన్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. గతంలో తమ అధినేత చంద్రబాబు మాట ఇచ్చినట్లుగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని, టీడీపీ పార్టీ కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు కట్టుబడిందని ఆయన స్పష్టం చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..
అంతరిక్ష పరిశోధన రంగంలో తెలంగాణ మరో అద్భుత మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్ వేదికగా రూపుదిద్దుకున్న దేశంలోనే …
ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ …
కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008333
Total views : 54822

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.