రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ పథకం కింద 4 వేల 696 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలకు మిడ్ మానేర్ నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు. బిఆర్ఎస్ సర్కారు హయాంలో ముంపు గ్రామాల నిర్వాసితుల పక్షాన పోరాడి తాను అనేక కేసులు ఎదుర్కొన్నానని చొప్పదండి ఎమ్మెల్యే సత్యం అన్నారు. నిర్వాసితుల ఉద్యమంలో రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారన్నారు. ప్రజా ప్రభుత్వంలో మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని తాము ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చామని, ఇప్పుడు ఆ హామీ నెరవేర్చుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే సత్యం.
గత బిఆర్ఎస్ సర్కారు మిడ్ మానేరు కింద విలువైన భూములను లాక్కొని బాధితులను రోడ్డున పడేసిందన్నారు. కానీ కాంగ్రెస్ సర్కారు వారిని అక్కున చేర్చుకుందన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. నిర్వాసితుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మేడిపల్లి సత్యం కృతజ్ఞతలు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం…
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
- నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
- పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి