రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ పథకం కింద 4 వేల 696 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలకు మిడ్ మానేర్ నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు. బిఆర్ఎస్ సర్కారు హయాంలో ముంపు గ్రామాల నిర్వాసితుల పక్షాన పోరాడి తాను అనేక కేసులు ఎదుర్కొన్నానని చొప్పదండి ఎమ్మెల్యే సత్యం అన్నారు. నిర్వాసితుల ఉద్యమంలో రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారన్నారు. ప్రజా ప్రభుత్వంలో మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని తాము ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చామని, ఇప్పుడు ఆ హామీ నెరవేర్చుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే సత్యం.
గత బిఆర్ఎస్ సర్కారు మిడ్ మానేరు కింద విలువైన భూములను లాక్కొని బాధితులను రోడ్డున పడేసిందన్నారు. కానీ కాంగ్రెస్ సర్కారు వారిని అక్కున చేర్చుకుందన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. నిర్వాసితుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మేడిపల్లి సత్యం కృతజ్ఞతలు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 197015