కేంద్ర ఎన్నికల(Central Election) సంఘం నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రభుత్వ పథకాల విడుదలకు అభ్యంతరం చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలను వాయిదా వేయాలని ఈసీ స్పష్టం చేసింది. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించేందుకు స్క్రీనింగ్ కమిటీ ఈసీకి ప్రతిపాదనలు పంపింది. అయితే, ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఎన్నికలు ముగిశాకే ఇన్ పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేయాలని స్పష్టం చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఏపీ సీఎం జగన్ ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. చంద్రబాబు పై తీవ్రస్థాయిలో చేస్తున్న వ్యాఖ్యలపై ఈసీ హెచ్చరించింది. ఇలానే కొనసాగితే ప్రవర్తనా నియమాళి ఉల్లంఘించినట్లు భావించాల్సి వస్తుందని పేర్కొంది. ప్రచారంలో జాగ్రతగా వ్యవహరించాలని ఈసీఐ జగన్ కు సూచించింది. కాగా జగన్ పై వ్యాఖ్యల నేపధ్యంలో చంద్రబాబును కూడా ఈసీ హెచ్చరించింది.
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- అనంతపురంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం.అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు కీలక పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం…
- వైభవంగా గోదావరి పుష్కరాలు.గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 8…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.