కేంద్ర ఎన్నికల(Central Election) సంఘం నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రభుత్వ పథకాల విడుదలకు అభ్యంతరం చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలను వాయిదా వేయాలని ఈసీ స్పష్టం చేసింది. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించేందుకు స్క్రీనింగ్ కమిటీ ఈసీకి ప్రతిపాదనలు పంపింది. అయితే, ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఎన్నికలు ముగిశాకే ఇన్ పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేయాలని స్పష్టం చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఏపీ సీఎం జగన్ ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. చంద్రబాబు పై తీవ్రస్థాయిలో చేస్తున్న వ్యాఖ్యలపై ఈసీ హెచ్చరించింది. ఇలానే కొనసాగితే ప్రవర్తనా నియమాళి ఉల్లంఘించినట్లు భావించాల్సి వస్తుందని పేర్కొంది. ప్రచారంలో జాగ్రతగా వ్యవహరించాలని ఈసీఐ జగన్ కు సూచించింది. కాగా జగన్ పై వ్యాఖ్యల నేపధ్యంలో చంద్రబాబును కూడా ఈసీ హెచ్చరించింది.
- సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు హైకోర్టు విధించిన నిబంధనలను సడలించాలని సిట్ కోరింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, సీఐ నాగరాజును ఒక రోజు…
- అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు…
- ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 197149