Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Latest News డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని చితకబాదిన కాంగ్రెస్ నాయకులు..

డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని చితకబాదిన కాంగ్రెస్ నాయకులు..

by Prakash
money

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచేర్ల క్రాస్ వద్ద కారులో డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని కాంగ్రెస్ నాయకులు చితకబాదారు.
కాంగ్రెస్ నాయకుల చేతిలో చితకబాదిన వ్యక్తి వద్ద తెలంగాణ పోలీసు శాఖలో వరంగల్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ గా అతని వద్ద ఐడి కార్డు లభించింది..
కారులో ఉన్న రెండు బ్యాగులను తీసుకొని మరికొందరు వ్యక్తులు పారిపోయినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. స్థానిక పోలీసులు ప్లేయింగ్ స్క్వాడ్ వచ్చి తనిఖీలు చేయగా అందులో 500,200 రూపాయల నోట్ల కట్టలు లభించాయి. పోచారం మున్సిపాలిటీ, ఘట్ కేసర్ ప్రాంతాలకు తరలిస్తుంన్నారన్న సమాచారంతో కాంగ్రెస్ నాయకులు కారు అడ్డగించి పట్టుకున్నట్లు చెబుతున్నారు. అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ బిజెపి నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డబ్బులు తరలింపు వ్యవహారం వెనకాల మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం చేస్తూ చెంగిచెర్ల క్రాస్ హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు. కారు వద్దకి చేరుకున్న రిటర్నింగ్ అధికారి. డబ్బు స్వాదీనం చేసుకున్నారు.

Advertisements

You may also like

Our Visitor

025853
Total views : 149297

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.