Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh చేతికొచ్చిన పంట దక్కించుకోవడానికి నానా కష్టాలు…

చేతికొచ్చిన పంట దక్కించుకోవడానికి నానా కష్టాలు…

by Prakash
Many difficulties to get the harvest..

చేతికొచ్చిన వరి పంట దక్కించుకోవడానికి రైతులు నానా కష్టాలు పడ్డారు. ఆకాశం ఒక్కసారిగా మేగావృతమై చిరుజల్లులు పడటంతో పండించిన పంట చేతికి రాదేమోనని రైతు గుండెల్లో గుబులు మొదలైంది. కృష్ణ జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ మండలంలో బిపిటీ సన్న విత్తనాలతో రైతులు వరి సాగుచేశారు. చేతికొచ్చే పంటను కాపాడుకోవడానికి యంత్రాల సహాయంతో కోసి ధాన్యాన్ని ఒడ్డుకు చేర్చుకున్నారు. ఒక్క ఎకరాకు 40 నుంచి 45బస్తాలు, హెక్టార్లుకు 100 నుంచి 115బస్తాల దిగుబడి వస్తుందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 76 కేజీల ధాన్యం ధర 17వందల రూపాయలు… క్వింటాలు ధాన్యం ధర 2వేల 300 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు రైతులు తేలియజేస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని చల్లపల్లి , మోపిదేవి, ఘంటసాల మండలాలలో రైతాంగం పలు రకాల వరి వంగడాలపై ఆసక్తి చూపారు. అయితే రైతులు ఆశించిన విధంగానే ఎకరాకు 38 నుంచి 44 బస్తాల దిగుబడి వస్తుంది. క్వింటల్ ధాన్యం ధర 2వేల 200 రూపాయలకు కోనుగోలు చేస్తున్నారు. మంచి దిగుబడి రావడంతో.. రైతులు పడిన కష్టానికి తగిన ఫలితం లభించింది.

Advertisements

You may also like

Our Visitor

039274
Total views : 195608

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: