ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం జరిపిన చర్చలు ఫలించాయి. దీనితో కార్మకులు సమ్మె విరమణ ప్రకటన చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభత్వం సానుకూలంగా స్పందించిందన్నారు మంత్రి బొత్స సత్యనారయణ. ప్రభుత్వ హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయన్నారు. 21వేల వేతనంతో,ఇతర సదుపాయాలను కూడ ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.