మంచిర్యాల జిల్లా మందమర్రిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా రామగుండం కమిషనరేట్ సీపి రెమారాజేశ్వరి డిఐజీ, ఆదేశాల మేరకు ఈరోజు రామకృష్ణాపూర్ పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో CRPF జవాన్ లతో పాటు మందమర్రి పోలీస్ సర్కిల్ రామకృష్ణపూర్ పోలీస్ సిబ్బంది తో సూపర్ బజారు RK4 గడ్డ నుండి రవీంద్రఖని రైల్వేస్టేషన్ రోడ్ రాజీవ్ చౌరస్తా బిజోన్ ఏరియా వివిధ బస్తి లలో పోలీస్ కవాతు నిర్వహించారు. బెల్లంపల్లి ఏసీపీ పి. సదయ్య, మంచిర్యాల డిసీపి రామ్నాద్ కొంకెన్ ఆధ్వర్యంలో CRPF అధికారులు, సీఐ మహేందర్ రెడ్డి మందమర్రి రామకృష్ణపూర్ పిఎస్ ఎస్ఐ లు పాల్గొన్నారు. మహేందర్ రెడ్డి, సీఐ మాట్లాడుతూ.. తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు మరియు ప్రజలు నిర్భయంగా తమ ఓటును వినియోగించుకునేందుకు ప్రజలకు మేము వున్నాము అనే భరోసాను కల్పించుటకు గాను ఇట్టి పోలీస్ మార్చ్ కవాతు నిర్వహించటం జరిగిందని, అదేవిధంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్నీ రాజకీయ పార్టీలు సహకరించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని, చివరి ఘట్టంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి కేసుల పాలవద్దని పోలీస్ లకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కవాతు..
271
previous post




Total views : 147172