Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh ‘ప్రజాగళం’ చారిత్రాత్మక భారీ బహిరంగ సభ…

‘ప్రజాగళం’ చారిత్రాత్మక భారీ బహిరంగ సభ…

by Prakash
'Prajagalam' historic huge public meeting...
చిలకలూరిపేట ప్రజా గళం సభకు జగ్గంపేట నియోజకవర్గం నుండి 300 కార్లతో బయలుదేరిన జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా జగ్గంపేట.. టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో చిలకలూరిపేట మండలం, బొప్పూడిలోని ప్రసన్నాంజనేయ స్వామి గుడి వద్ద మార్చి 17, ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు జరుగుతున్న ‘ప్రజాగళం’ చారిత్రాత్మక భారీ బహిరంగ సభకు జగ్గంపేట నియోజకవర్గం నుండి జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి గోకవరం మండలాల నుంచి 300 కార్లతో రావులమ్మ తల్లి ఆలయం వద్ద నుండి ఉదయం 9 గంటలకు జ్యోతుల నెహ్రూ జండా ఊపి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత మొట్టమొదటిగా బిజెపి, జనసేన, టిడిపి ఉమ్మడి వేదికగా ప్రజా గళం సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ, వి జినరీ నాయకుడు చంద్రబాబు, పోరాటయోధుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగే ఈ ప్రజా గళం సభ నుండి ఎన్నికల శంఖారావం పూరించడం జరుగుతుందని జగ్గంపేట నియోజకవర్గం నుండి 300 కార్లలో భారీగా తరలి వెళ్లడం జరుగుతుందని ఇంకా భారీగా బస్సులు ఏర్పాటు చేసుకుని వెళదాము అనుకున్నామని కానీ తొందరలోనే మన ప్రాంతంలో కూడా సభలు ఉంటాయని తెలియజేయడంతో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి కార్యకర్తలతో వెళ్లడం జరిగిందని అన్నారు…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: