Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra Pradesh సైకో జగన్ పాలన అంతమే మా అంతిమ లక్ష్యం..

సైకో జగన్ పాలన అంతమే మా అంతిమ లక్ష్యం..

by Rama
badeti chanti

రాష్ట్రాభివృద్ధిని ధ్వంసం చేసి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సైకో జగన్ పాలన అంతమే తమ అంతిమ లక్ష్యం అని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. టిడిపి, జనసేన పార్టీల సమన్వ కమిటీ సమావేశం ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి రాష్ట్రంలోని రాక్షస పాలన అంతం చేయాలన్నారు. విజన్ ఉన్న నాయకుడు రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేసే చంద్రబాబు నాయుడు, విప్లవాత్మకమైన ఆలోచనతో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ ల కలయిక అధికార పార్టీ వైసిపి నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ఏలూరు నియోజకవర్గంలో టిడిపి జనసేన కలిసి సమిష్టిగా పని చేస్తాయని. రానున్న ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలో టిడిపి జనసేన జెండాలు ఎగరవేస్తామని అన్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

012557
Total views : 75373

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.