నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో తాళం వేసిన ఇంట్లో తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. భార్యాభర్తలు ఇంటికి తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్లారు. విషయం గమనించిన దొంగలు ప్రధాన రహదారిపై ఉన్న ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమానులు వస్తే ఇంట్లో ఎంత నగదు, బంగారం అపహరణకు గురైందని విషయం తేలనుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Tag:






Total views : 90764