2019 ముందు జగన్ మోహన్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసాడని బోండా ఉమా అన్నారు. లక్ష పది వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆయన అన్నారు. జగన్ ఇచ్చిన హామీలు నిరవేర్చకుండా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగం అమలు చేస్తున్నాడని అన్నారు. అలాగే ఈ రోజు మున్సిపల్ కార్మికులు నిరసన వల్ల విజయవాడ అంతా కంపు కొడుతా ఉందని అన్నారు. ఈ రోజు ఈ చిరు ఉద్యోగుల మీద నువ్వు ఎందుకు ఇంత కూరాత్మకంగా వ్యవహరిస్తున్నావని ఆయన జగన్ ను ప్రశ్నించారు. అంగన్వాడీ ఉద్యో్గులు ఉద్యోగాలకి వెళ్లకపోవడం వల్ల గర్భిణీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మున్సిపల్ కార్మికులు ఉద్యోగాలకు వెళ్ళాక పోవడం వలన సుమారు రోజుకు 600 టన్నుల చెత్త రోడ్డు ల పడి ఉన్నాడని అన్నారు. ఈ చలికాలం లో చెత్త పేరుకు పోవటం వలన దోమల బెడద ఎక్కువై ప్రజలు అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హాస్పిటల్స్ లో ప్రజలు జాయిన్ అవుతుంటుంటే ఆరోగ్య శ్రీ పనిచేయడం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ ఉద్యోగులకు, మున్సిపల్ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు. అన్ని నిత్యా అవసర సరుకుల ధరలు పెంచావు ఈ ప్రభుత్వం లో ప్రజలు ఎంతో నరకం అనుభవించారని అన్నారు. ఈ ప్రభుత్వం తో ప్రజలు విసిగి పోయారు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉందని గుర్తు చేసారు. ఆ రోజు నువ్వు అధికారంలోకి రావడం కోసమే జనాలకు అమలు కానీ హామీలు ఇచ్చావని ఆయన అన్నారు.
Tag:
ఎన్టీఆర్ జిల్లా న్యూస్
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో గత 11 రోజులుగా కొనసాగుతున్న చండీ సహిత అతిరుద్ర మహా యజ్ఞం నేటి తో దిగ్విజయంగా ముగిసింది. రుత్వికుల మంత్రోచ్చారణనలతో శ్రీ వాసుదేవానంద స్వామి సమక్షంలో పూర్ణాహుతి కార్యక్రమం జయప్రదంగా పూర్తయింది. సి వి అర్ గ్రూప్ చైర్మన్ చలసాని వెంకటేశ్వరరావు దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. లోకకళ్యాణార్థం నిర్వహించిన ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యం కావటం మహా భాగ్యమని పండితులు తెలిపారు.





Total views : 78235