గత 20 రోజులుగా తమకు న్యాయం చెయ్యాలని ఏపీలో అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. జగన్ కు, వారి ఎమ్మెల్యేలకు ఆడవారి ఉసురు తగులుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. అన్ని వర్గాలకు చెందిన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చెయ్యాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బంది పెడితే జనసేన పార్టీ వారికి అండగా నిలుస్తుందన్నారు. అంగన్వాడీల సమస్యలకు పరిష్కారం చూపకుండా ఎమ్మెల్యేలు, ఎంపీల బదిలీల కార్యక్రమంలో నిమగ్నమయ్యారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Tag:
ఎస్మా చట్టం
తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన అంగన్వాడీలకు నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సంఘీభావం తెలిపారు. 2014వ సంవత్సరంలో 4200 ఉన్న అంగన్వాడీ జీతాలను రెండు పర్యాయలుగా పెంచి 10500 చేయడం జరిగిందని తెలిపారు. నాలుగున్నర ఏళ్ళు పరిపాలించిన వైకాపా హయాంలో వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి అంగన్వాడీలను మోసం చేశారన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణం అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవడం లేదని రాజారెడ్డి రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుందని ఎద్దవా చేశారు.





Total views : 79333