గత 20 రోజులుగా తమకు న్యాయం చెయ్యాలని ఏపీలో అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. జగన్ కు, వారి ఎమ్మెల్యేలకు ఆడవారి ఉసురు తగులుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. అన్ని వర్గాలకు చెందిన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చెయ్యాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బంది పెడితే జనసేన పార్టీ వారికి అండగా నిలుస్తుందన్నారు. అంగన్వాడీల సమస్యలకు పరిష్కారం చూపకుండా ఎమ్మెల్యేలు, ఎంపీల బదిలీల కార్యక్రమంలో నిమగ్నమయ్యారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
జనసేన పార్టీ
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ నజీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి విజయోత్సవ సభ ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశలకు ఒక నవశకంగా మారినటువంటి పరిస్థితులను చూసాం. రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ సమావేశాలకు రానటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రాంతం నుండి అశేష ప్రజానికం విజయనగరం వైపు రావడంతో జన సముద్రం గా మారినటువంటి పరిస్థితులు కనిపించాయని మహమ్మద్ నసీర్ తెలిపారు. తెలుగుదేశం వీర సైనికులు, జనసేన జన సైనికులు కదిలి వచ్చారని అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారు మరోపక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ గారు పాల్గొన్నారు. యువగలం రథసారథి అయిన నారా లోకేష్ గారు చేపట్టినటువంటి దాదాపు 226 రోజుల సుదీర్ఘ పాదయాత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 97 నియోజకవర్గాలు దాదాపు 2100 గ్రామాలను ఆయన సందర్శించారు. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్న ఇబ్బందులు కనుక్కొని వారికి భరోసా కల్పించేటువంటి కార్యక్రమం చేశారని ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం తను నిస్వార్ధంగా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని బలపరిచేటువంటి కార్యక్రమం ఎందుకు చేశారని వివరించినటువంటి తీరు అద్భుతం అన్నారు. సభకు వచ్చిన జన సంద్రాన్ని చూసి వైసీపీ మంత్రులకు, జగన్ మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. మంత్రి రోజా పవిత్రమైనటువంటి గుడిలో లోకేష్ గారి మీద వ్యంగంగా మాట్లాడడం సరికాదన్నారు. రోజా గారికి రోజులు దగ్గరపడ్డాయి ఆమె మంత్రిగా ప్రజలకు ఏం సేవ చేసిందో ఒక్కసారి చెప్పాలని అన్నారు. అలాగే వెల్లంపల్లి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఈరోజు లోకేష్, పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఏ విధమైనటువంటి స్పందన వస్తోందో ప్రజలందరూ ఆలోచించాలని, పరదాలు కట్టుకుని తిరిగేటటువంటి దౌర్భాగ్య స్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయారని తెలిపారు. ప్రజల్లో గుండె ధైర్యం కలిగిస్తూ ముందుకు సాగేటువంటి నాయకత్వం నారా లోకేష్ గారిది అందుకని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, జనసేన సైనికులు గాని మన అందరి నాయకుల సమక్షంలో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ నసీర్ తెలియజేశారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఇంటింటికి ప్రచారంలో భాగంగా ,శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ నుండి నగరం నడిబొడ్డులోని సదా శివ టవర్స్ వేదిక వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ కోట వినుత మరియు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు. ఇంటింటికి ప్రచారం అనే నినాదంతో వైయస్సార్సీపి చేసిన అవకతవకల పనులన్నీ ప్రజలకు తెలియజేస్తామని, వైయస్సార్సీపి పార్టీకి చివరి రోజులు గడుస్తున్నాయని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి జనసేన పార్టీ – తెలుగుదేశం కలయికతో విజయం సాధిస్తామని కోట వినుత తెలిపారు.





Total views : 78566