శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జోన్నవాడ గ్రామం నందు కొత్తగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామానికి చెందిన మహిళలతో ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక మహిళలు ఇంటి స్థలం మంజూరు చేయాలంటూ కోవూరు ఎమ్మెల్యేని ఆశ్రయించిగా ఆయన ఆగ్రహంతో మీరు అంతా టీడీపీ వారు పంపిస్తే వచ్చారా అని మండిపడ్డారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. తాము ఏ పార్టీకి చెందిన వారము కాదని ఇళ్ల స్థలం కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే తమపై విరుచుకుపడడం ఏమిటని బాధపడ్డారు.
Tag:
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
ఏపీ సర్కారు కనిగిరి రిజర్వాయర్ రైతులకు తీపి కబురు అందించింది. ఆయకట్టుకు నీరు విడుదల చేసింది. నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీటిని విడుదల చేశారు. పెన్నాడెల్టాకు 2 లక్షల ఎకరాలకు సాగురు అందిస్తామన్నారు. బుచ్చి, కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాలలోని 26 వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. జగన్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు. ఇటీవలిఐఎబి సమావేశంలో టిడిపి నాయకులు అనవసర రాద్ధాంతం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. రైతుల పట్ల దొంగ ప్రేమ ప్రదర్శించారని ఆరోపించారు. టిడిపి వాళ్లకు ఇన్నాళ్లూ కనబడని ప్రేమ ఎన్నికలు వస్తున్నాయనగా పుట్టికొచ్చిందన్నారు.





Total views : 79836