ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కావాలని గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు నాలుగు రోజుల పాటు గన్నవరంలో శత చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈనెల 7 వ తారీఖు నుండి 10 వ తారీకు మధ్యాహ్నం వరకు ఈ యాగం నిర్వహించనున్నట్లు వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ దాదాపు నాలుగు రోజులు పాటు ఈ యాగం గన్నవరంలో నిర్వహించనున్నాము. యాగం నిర్వహించడానికి ప్రధాన కారణం అక్షర కమలం ముందున్న ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో అధోగతి పాలవుటమే, ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ రాష్ట్రా అభివృద్ధిని మళ్ళి గాడిలో పెట్టాలన్న పడిపోయిన ఆస్తుల విలువలు పెరగాలన్న ఐటీ ఉద్యోగాలు రావాలన్న ఉపాధి అవకాశాలు పెరగాలన్న పరిశ్రమలు రావాలన్న ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా కావటం తక్షణ అవసరం అని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. దేవుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు కి ఉండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో రాజమండ్రి కి చెందిన అర్చకులు, వృత్వికులు, వేద పండితులు 30 మందితో ఈ యాగం నిర్వహించడం జరుగుతుంది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ కి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని భావిస్తూ ప్రజలు ఆయనకి అవకాశం ఇస్తారని నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
నారా చంద్రబాబు నాయుడు
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళగిరి టిడిపి కార్యాలయంలో జయహో బీసీ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పలువురు టిడిపి బీసీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం బీసీలకు ఎటువంటి అభివృద్ధి ఫలాలు అందించలేదని, విలువైన పదవులు అధికారాలు పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు తప్ప బీసీలను ఎక్కడ పట్టించుకోలేదని, కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదని, టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేసి బీసీలకు మరిన్ని రాజ్యాధికార పదవులు చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారని అన్నారు. వైఎస్ షర్మిల రాబోయే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ని ఓడించబోతుందని టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈనెల 5న కనిగిరి నియోజకవర్గంలో నిర్వహించే 2024 ఎన్నికల సమర శంఖారావానికి వేలాది సంఖ్యలో పాల్గొనాలని టిడిపి మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నేడు దర్శి టీడీపీ పార్టీ ఆఫీసులో దర్శి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా టిడిపి మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2024 లో జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం జెండా ఎగరబోతుందని అన్నారు. 2024 ఎలక్షన్ సమర శంఖారావానికి కనిగిరి వేదిక కావడం మరింత శుభ పరిణామం అని ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు తెలిపారు. అలాగే జరిగినటువంటి నాలుగున్నర సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కార్యక్రమాలు తప్ప ప్రకాశం జిల్లాకి చేసింది ఏమీ లేదంటూ పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి 175 కి 175 సీట్లు వస్తాయని ఇప్పటికీ పగటి కలలు కంటున్నాడని, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పరదాల చాటు నుంచి బయటికి చూస్తే ఆయనకు అర్థమవుతుంది ప్రజలు ఏ వైపు ఉన్నారనేది అంటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో నేడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు – భువనేశ్వరి దంపతులు ప్రార్థించారు. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో 40 మంది రిత్వికులు యాగం నిర్వహించారు. రేపు, ఎల్లుండి కూడా యజ్ఞహోమాది కార్యక్రమాలు జరగనున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు పార్టీ నేతలు కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్నారు.





Total views : 78605