కర్నూలు జిల్లా పెద్దకడుబూరులో “నిజం గెలవాలి యాత్ర” లో భాగంగా నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు మనస్తాపానికి గురై మృతి చెందిన గొనపాడు గోపాల్ కుటుంబాన్ని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చి రూ 3 లక్షలు నగదు చెక్కును ఇచ్చి ఆర్థిక సహాయం అందజేశారు. నారా భువనేశ్వరి ని చూసేందుకు భారీగా మహిళలు, పురుషులు తరలి వచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు నారా భువనేశ్వరి కాన్వయ్ ని అడ్డుకొని తమ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేయాలని, జీతాలు పెంచాలని వినతి పత్రం అందజేశారు. వచ్చేది మా ప్రభుత్వంమే ఖచ్చితంగా సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.
నారా భువనేశ్వరి
శ్రీకాకుళం జిల్లా, నిజం గెలవాలి పేరుతో నేడు శ్రీకాకుళం, మన్యం జిల్లాల లో పర్యటించనున్న నారా భువనేశ్వరి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో మనస్థాపానికి గురై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి. రాజాం జి.ఎం.ఆర్ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం దవలపేట గ్రామానికి చేరుకొని మృతి చెందిన కంచరాన అసిరినాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి. అనంతరం అక్కడ నుండి మన్యం జిల్లా
భామిని మండలం బిల్లమడ గ్రామానికి చేరుకొని బిల్లమడ గ్రామంలో మృతి చెందిన బర్రి విశ్వనాథం కుటుంబాన్ని పరామర్శ. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం తోటాడ గ్రామం చేరుకొని తోటాడ గ్రామంలో గేదెల సాంబమూర్తి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం దన్నానపేట గ్రామంలో మృతి చెందిన గొర్లె తిరుపతిరావు కుటంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం పాత నిమ్మతొర్లాడ గ్రామం చేరుకొని ఆగ్రామంలో మృతి చెందిన ఆకేటి పాపయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు.
చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో కుటుంబసభ్యులు ములాఖత్ కానున్నారు. బాబును నారా భువనేశ్వరి, నారా లోకేష్ కలవనున్నారు. తిరుపతి జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్ర ముగించుకుని రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి రాజమండ్రికి ప్రత్యేక విమానంలో భువనేశ్వరి బయల్దేరారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కుటుంబసభ్యుల ములాఖత్ ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఇటీవల భువనేశ్వరికి రిపోర్ట్ పంపించారు. అలాగే జైల్లో తన భద్రతకు ముప్పు ఉందని ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాశారు. ఇలాంటి తరుణంలో కుటుంబసభ్యులు ములాఖత్ కానుండటం కీలకంగా మారింది. గత రెండు ములాఖత్ల తర్వాత కుటుంబసభ్యులు మీడియాతోనే మాట్లాడకుండా వెళ్లిపోయారు. దీంతో రేపు చంద్రబాబుతో ములాఖత్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడతారా..? లేదా? అనేది కీలకంగా మారింది.






Total views : 75444