ఏపీ అధికార పక్షం వైసీపీకి మరో నేత దూరమయ్యాడు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు, తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. సంజీవ్ కుమార్ ను ఇటీవల వైసీపీ అధినాయకత్వం కర్నూలు పార్లమెంటు స్థానం ఇన్చార్జి పదవి నుంచి తప్పించింది. ఈ కారణంగానే ఆయన మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయంపై డాక్టర్ సంజీవ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. తన అనుచరులు, మద్దతుదారులు, బంధువర్గంతో చర్చించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఇవాళ ఉదయమే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, ఇంకా ఏ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
Tag:
రాజీనామా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ హైకమాండ్ నిర్ణయించగా, ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనంటూ తెలంగాణ టీడీపీ నేతలు పట్టుబట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, అటు అధిష్ఠానానికి, ఇటు తెలంగాణ టీడీపీ నేతలకు మధ్య తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నలిగిపోయారు. తెలంగాణ టీడీపీ నేతల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లను తట్టుకోలేక కాసాని జ్ఞానేశ్వర్ ఇవాళ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయింది… పవన్ ఎప్పుడు పరిపక్వమవుతాడో? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇటీవల కూడా అంబటి… తెలంగాణలో చేతులెత్తేసిన తెలుగుదేశం… త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అంటూ ఎద్దేవా చేశారు.




Total views : 78406