తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. గత ఎన్నికల వేళ కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయని సీఈవో తెలిపారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్సభ ఎన్నికల వేళ సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ మేరకు ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో.. లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
2023
టీడీపీ అధినేత చంద్రబాబు కేసులు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. నేడు ఢిల్లీలో సిద్ధార్థ్ లూథ్రా తనయుడి వివాహం జరగనుంది. ఎల్లుండి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ పెళ్లి రిసెప్షన్ కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి కూడా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు. చంద్రబాబు ఈ నెల 28 వరకు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. కాగా, ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో, చంద్రబాబు త్వరలోనే మళ్లీ ప్రజల్లోకి రానున్నారని తెలుస్తోంది.
నిరుద్యోగ చైతన్య యాత్ర చెన్నూర్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నది.నిరుద్యోగ చైతన్య యాత్ర సభ్యులకు ఘన స్వాగతం పలికారు చెన్నూర్ ప్రజలు. ప్రొఫెసర్ రియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి వెంటనే గద్దె దించాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నరేళ్లయిందని, ఈ సమయంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నర్సాపూర్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరీ యాత్రలో రేవంత్ పాల్గొన్నారు. తెలంగాణ వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయనుకుంటే రైతుల ఆత్మహత్యలు కలిచివేశాయన్నారు. నిరుద్యోగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారన్నారు. వచ్చే నెలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
విశాఖ:
ఈనెల 23 న విశాఖలో ఏసిఏ , వీడిసిఏ స్టేడియంలో Ind vs Aus t20 మ్యాచ్ కు రంగం సిద్ధం అయ్యింది అని డిసిపి -1 కే. శ్రీనివాసరావు తెలియజేసారు.
ఏసిఏ- విడిసిఏ స్టేడియం బి గ్రౌండ్,మున్సిపల్ స్టేడియం, గాజువాకలో రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆఫ్ లైన్ టిక్కెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఆఫ్ లైన్ లో ఒక్కొరికి రెండు టిక్కెట్లు మాత్రమే, కలెక్టర్ గారు అనుమతి తో రెవెన్యూ అధికారులు సమక్షంలో పారదర్శకంగా టికెట్లు విక్రయిస్తారు. రేపటి నుంచి రెండు రోజులు ఆన్ లైన్ లో 10,500 వరకూ టిక్కెట్లు విక్రయాలు. 17,18 తేదీల్లో ఆఫ్ లైన్ లో 11,500 టిక్కెట్లు పేటిఎం ఇంసైడేర్ వెబ్ సైట్ లో విక్రయాలు..బీసీసీఐ షరతులు విధంగా కాంప్లిమెంట్లు 5,300..టికెట్లు జారీ చేస్తాం అని తెలిపారు ఏసీఏ సెక్రెటరీ గోపీనాధ్ రెడ్డి
1500 మంది పోలీసులతో బందోబస్తు, ఇతర జిల్లాలు మరియు స్పెషల్ ఫోర్స్ పోలీసులు ఉంటారని, మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టేడియంలో సీట్లలోకి చేరుకోవాలి. మ్యాచ్ పూర్తయ్యాక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సహకరించాలి. ఒకసారి స్కాన్ అయ్యాక తరిగి లోపలికి అనుమతించబడరు. టికెట్స్ కలర్ జిరెక్స్ లు తీసి ఎవరికైనా విక్రయిస్తే కఠినమైన చర్యలు..వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించాము..బౌన్సర్లు కి అనుమతి ఇచ్చే ముందు వారి క్రిమినల్ డేటా పరిశీలించి అనుమతి ఇస్తాము..బయట వ్యక్తులకు స్టేడియంలో అనుమతి కావాలంటే స్పెషల్ బ్రాంచ్ అధికారులతో ఎంక్వేరి చేసి ఐడి కార్డు జారీ చేస్తామని ఆయన తెలిపారు…





Total views : 78024