Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Sports విశాఖ లో Ind vs Aus మ్యాచ్… ఫ్యాన్స్ కు ఇక పండగే…

విశాఖ లో Ind vs Aus మ్యాచ్… ఫ్యాన్స్ కు ఇక పండగే…

by Prakash
india vs australia t20 in vizag 2023

విశాఖ:

ఈనెల 23 న విశాఖలో ఏసిఏ , వీడిసిఏ స్టేడియంలో Ind vs Aus t20 మ్యాచ్ కు రంగం సిద్ధం అయ్యింది అని డిసిపి -1 కే. శ్రీనివాసరావు తెలియజేసారు.
ఏసిఏ- విడిసిఏ స్టేడియం బి గ్రౌండ్,మున్సిపల్ స్టేడియం, గాజువాకలో రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆఫ్ లైన్ టిక్కెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఆఫ్ లైన్ లో ఒక్కొరికి రెండు టిక్కెట్లు మాత్రమే, కలెక్టర్ గారు అనుమతి తో రెవెన్యూ అధికారులు సమక్షంలో పారదర్శకంగా టికెట్లు విక్రయిస్తారు. రేపటి నుంచి రెండు రోజులు ఆన్ లైన్ లో 10,500 వరకూ టిక్కెట్లు విక్రయాలు. 17,18 తేదీల్లో ఆఫ్ లైన్ లో 11,500 టిక్కెట్లు పేటిఎం ఇంసైడేర్ వెబ్ సైట్ లో విక్రయాలు..బీసీసీఐ షరతులు విధంగా కాంప్లిమెంట్లు 5,300..టికెట్లు జారీ చేస్తాం అని తెలిపారు ఏసీఏ సెక్రెటరీ గోపీనాధ్ రెడ్డి
1500 మంది పోలీసులతో బందోబస్తు, ఇతర జిల్లాలు మరియు స్పెషల్ ఫోర్స్ పోలీసులు ఉంటారని, మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టేడియంలో సీట్లలోకి చేరుకోవాలి. మ్యాచ్ పూర్తయ్యాక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సహకరించాలి. ఒకసారి స్కాన్ అయ్యాక తరిగి లోపలికి అనుమతించబడరు‌‌‌‌. టికెట్స్ కలర్ జిరెక్స్ లు తీసి ఎవరికైనా విక్రయిస్తే కఠినమైన చర్యలు..వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించాము..బౌన్సర్లు కి అనుమతి ఇచ్చే ముందు వారి క్రిమినల్ డేటా పరిశీలించి అనుమతి ఇస్తాము..బయట వ్యక్తులకు స్టేడియంలో అనుమతి కావాలంటే స్పెషల్ బ్రాంచ్ అధికారులతో ఎంక్వేరి చేసి ఐడి కార్డు జారీ చేస్తామని ఆయన తెలిపారు…

Advertisements

You may also like

Our Visitor

013871
Total views : 78245

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.