ఇండియా -ఆస్ట్రేలియా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయిందని ఓ క్రికెట్ అభిమాని మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు వివరాలు మేరకు….తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంకి చెందిన జ్యోతిష్ కుమార్ యాదవ్ (35) క్రికెట్ అభిమాని.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా బెంగళూరులో పని చేస్తున్నాడు.. దీపావళి సెలవుల నిమిత్తం సొంత గ్రామానికి వచ్చారు. ఈరోజు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ టీవీలో తిలకిస్తూ ఇండియా ఓడిపోవడంతో హఠాత్తుగా గుండె పోటు వచ్చింది.. కుటుంబ సభ్యులు తిరుపతిలోని ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపు మార్గమధ్యలో మృతి చెందారు.
India vs Australia
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ను భారీ ఎల్ఈడి స్క్రీన్ లో తిలకిస్తున్న యువత. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శ్రీ కృత్తివేంటి పేర్రాజు పంతులు క్రీడా మైదానంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను 3 వేల మంది యువత తిలకించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్ ను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఏర్పాటు చేశారు. ఇండియా క్రికెట్ టీం,ఆస్ట్రేలియా క్రికెట్ టీం తో తలపడుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించి కేరింతలు కొడుతున్నారు. ఇండియా గెలవాలని కోరుకుంటున్నారు క్రికెట్ వీరాభిమాని బిక్కిన సునయన ఇండియా గెలుపొందాలని కోరుకుంటూ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ బిగ్ స్క్రీన్ వద్ద హల్చల్ చేశారు ఇండియా గెలిసి వరల్డ్ కప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కాటన్ పార్కు లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు భారీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు బిగ్ స్క్రీన్ వద్ద వైసీపీ నాయకులు క్రీడాభిమానులతో కలసి మ్యాచ్ ను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాభిమానులు అంతా పండుగ వాతావరణంలో మ్యాచ్ ను వీక్షిస్తున్నారని ఇండియా ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also..
విశాఖ:
ఈనెల 23 న విశాఖలో ఏసిఏ , వీడిసిఏ స్టేడియంలో Ind vs Aus t20 మ్యాచ్ కు రంగం సిద్ధం అయ్యింది అని డిసిపి -1 కే. శ్రీనివాసరావు తెలియజేసారు.
ఏసిఏ- విడిసిఏ స్టేడియం బి గ్రౌండ్,మున్సిపల్ స్టేడియం, గాజువాకలో రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆఫ్ లైన్ టిక్కెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఆఫ్ లైన్ లో ఒక్కొరికి రెండు టిక్కెట్లు మాత్రమే, కలెక్టర్ గారు అనుమతి తో రెవెన్యూ అధికారులు సమక్షంలో పారదర్శకంగా టికెట్లు విక్రయిస్తారు. రేపటి నుంచి రెండు రోజులు ఆన్ లైన్ లో 10,500 వరకూ టిక్కెట్లు విక్రయాలు. 17,18 తేదీల్లో ఆఫ్ లైన్ లో 11,500 టిక్కెట్లు పేటిఎం ఇంసైడేర్ వెబ్ సైట్ లో విక్రయాలు..బీసీసీఐ షరతులు విధంగా కాంప్లిమెంట్లు 5,300..టికెట్లు జారీ చేస్తాం అని తెలిపారు ఏసీఏ సెక్రెటరీ గోపీనాధ్ రెడ్డి
1500 మంది పోలీసులతో బందోబస్తు, ఇతర జిల్లాలు మరియు స్పెషల్ ఫోర్స్ పోలీసులు ఉంటారని, మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టేడియంలో సీట్లలోకి చేరుకోవాలి. మ్యాచ్ పూర్తయ్యాక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సహకరించాలి. ఒకసారి స్కాన్ అయ్యాక తరిగి లోపలికి అనుమతించబడరు. టికెట్స్ కలర్ జిరెక్స్ లు తీసి ఎవరికైనా విక్రయిస్తే కఠినమైన చర్యలు..వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించాము..బౌన్సర్లు కి అనుమతి ఇచ్చే ముందు వారి క్రిమినల్ డేటా పరిశీలించి అనుమతి ఇస్తాము..బయట వ్యక్తులకు స్టేడియంలో అనుమతి కావాలంటే స్పెషల్ బ్రాంచ్ అధికారులతో ఎంక్వేరి చేసి ఐడి కార్డు జారీ చేస్తామని ఆయన తెలిపారు…




Total views : 78908