ఈ నెల 22న అత్యంత వైభవోపేతంగా జరగనున్న అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ హాజరవ్వడం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు విరాట్ అభ్యర్థనను బీసీసీఐ పరిగణనలోకి తీసుకొని అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 21న ప్రాక్టీస్ సెషన్ అనంతరం కోహ్లీ టీమిండియా శిబిరం నుంచి బయలుదేరి మరుసటి రోజు అయోధ్య చేరుకోనున్నాడని క్రిక్బజ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ నుంచి అనుమతి ఇచ్చిందని తెలిపింది. కాగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం పొందిన క్రికెటర్లలో కోహ్లీతోపాటు మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీతోపాటు పలువురు దిగ్గజాలు ఉన్నారు. భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న 3 టీ20 మ్యాచ్లు ముగిసిన అనంతరం ఆటగాళ్లకి, సిబ్బందికి రెండు రోజుల విరామం లభిస్తుంది. అనంతరం ఇంగ్లండ్తో జరగనున్న 5 టెస్టుల సిరీస్కు సన్నాహలు మొదలుకానున్నాయి. తొలి టెస్టుకు వేదికైన హైదరాబాద్ చేరుకొని టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్తుండడంతో కోహ్లీ ఒక రోజు ప్రాక్టీస్ సెషన్కు దూరం కానున్నాడు.
BCCI
ఛాంపియన్స్ ట్రోపీ ఆతిథ్య బాధ్యతలను పాకిస్థాన్ కు అప్పగిస్తున్నట్లు ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. అయితే, దీనికి సంబంధించి ఇంకా అగ్రిమెంట్ పై సంతకాలు కాలేదు. ఈ మెగా టోర్నీకి తామే ఆతిథ్యమిస్తామని చెబుతున్న పాక్. టీమిండియా కనుక టోర్నీలో పాల్గొనకుంటే పరిహారం చెల్లించాల్సిందేనని ఐసీసీని డిమాండ్ చేస్తోంది. సెక్యూరిటీ పరంగా వ్యక్తమవుతున్న ఆందోళనలకు ఓ కొత్త పరిష్కారాన్ని సూచిస్తోంది. టీమిండియా ఆటగాళ్ల సెక్యూరిటీ బాధ్యతలు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించాలని, పాక్ పోలీసులు సహకరిస్తారని తెలిపింది. పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే భారత జట్టు టోర్నీకే దూరమయ్యే అవకాశం ఉంది. భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతుండడంతో పాక్ వెళ్లేందుకు ఆటగాళ్లు ఇష్టపడకపోవచ్చని తెలుస్తోంది. బీసీసీఐ కూడా టీమిండియాను పాక్ కు పంపే విషయంపై ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది. గతంలో పాక్ ఆసియా కప్ టోర్నీ నిర్వహించగా. టీమిండియా పాక్ వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేసింది. దీంతో భారత జట్టు ఆడాల్సిన మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించారు. ఈసారి మాత్రం అలాంటి ప్రత్యామ్నాయానికి అంగీకరించేందుకు పాక్ క్రికెట్ బోర్డు సిద్ధంగా లేదని సమాచారం. ఒకవేళ భారత జట్టు పాకిస్థాన్ కు రాకుంటే ఐసీసీ తమకు పరిహారం చెల్లించాల్సిందేనని పీసీబీ కోరుతోంది.
విశాఖ:
ఈనెల 23 న విశాఖలో ఏసిఏ , వీడిసిఏ స్టేడియంలో Ind vs Aus t20 మ్యాచ్ కు రంగం సిద్ధం అయ్యింది అని డిసిపి -1 కే. శ్రీనివాసరావు తెలియజేసారు.
ఏసిఏ- విడిసిఏ స్టేడియం బి గ్రౌండ్,మున్సిపల్ స్టేడియం, గాజువాకలో రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆఫ్ లైన్ టిక్కెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఆఫ్ లైన్ లో ఒక్కొరికి రెండు టిక్కెట్లు మాత్రమే, కలెక్టర్ గారు అనుమతి తో రెవెన్యూ అధికారులు సమక్షంలో పారదర్శకంగా టికెట్లు విక్రయిస్తారు. రేపటి నుంచి రెండు రోజులు ఆన్ లైన్ లో 10,500 వరకూ టిక్కెట్లు విక్రయాలు. 17,18 తేదీల్లో ఆఫ్ లైన్ లో 11,500 టిక్కెట్లు పేటిఎం ఇంసైడేర్ వెబ్ సైట్ లో విక్రయాలు..బీసీసీఐ షరతులు విధంగా కాంప్లిమెంట్లు 5,300..టికెట్లు జారీ చేస్తాం అని తెలిపారు ఏసీఏ సెక్రెటరీ గోపీనాధ్ రెడ్డి
1500 మంది పోలీసులతో బందోబస్తు, ఇతర జిల్లాలు మరియు స్పెషల్ ఫోర్స్ పోలీసులు ఉంటారని, మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టేడియంలో సీట్లలోకి చేరుకోవాలి. మ్యాచ్ పూర్తయ్యాక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సహకరించాలి. ఒకసారి స్కాన్ అయ్యాక తరిగి లోపలికి అనుమతించబడరు. టికెట్స్ కలర్ జిరెక్స్ లు తీసి ఎవరికైనా విక్రయిస్తే కఠినమైన చర్యలు..వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించాము..బౌన్సర్లు కి అనుమతి ఇచ్చే ముందు వారి క్రిమినల్ డేటా పరిశీలించి అనుమతి ఇస్తాము..బయట వ్యక్తులకు స్టేడియంలో అనుమతి కావాలంటే స్పెషల్ బ్రాంచ్ అధికారులతో ఎంక్వేరి చేసి ఐడి కార్డు జారీ చేస్తామని ఆయన తెలిపారు…




Total views : 149808