ఆశా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఏఐటియుసి ఇచ్చిన పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు హేమావతి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు సిహెచ్ శివ యూనియన్ జిల్లా కార్యదర్శి చాముండేశ్వరులు మాట్లాడుతూ ఆశా కార్మికులకు అనేక సమస్యలతో ఉన్నారని ప్రభుత్వం అధికారులు హామీలు ఇచ్చారు తప్ప, అమలు చేయడం లేదని వాటిని అమలు చేయాలి అని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరుగుతోంది. అందులో భాగంగానే మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది
AITUC
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు రోజులు అవ్వకముందే సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి డేట్ ఫిక్స్ అయ్యింది. సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అది పోస్ట్ పోన్ చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో డిప్యూటీ లేబర్ కమిషనర్ సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు సమక్షంలో జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, విప్లవ కార్మిక సంఘాలైన ఐఎఫ్టీయూ, ఇతర సంఘాల నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి ఏకాభిప్రాయానికి రావడంతో 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికుల ఓటరు లిస్ట్ను ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు.






Total views : 78098