సింగరేణి కార్మికులకు జనవరి నెల లో రావలసిన SLP (స్లూ) ప్రమోషన్ విషయంలో కొంత ఆలస్యం జరిగినది. ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య చోరువతో ఈ రెండు రోజులలో SLP (స్లు) ప్రమోషన్ లెటర్స్ ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించారని మంచిర్యాల జిల్లా మందమర్రి గుర్తింపు సంఘము ఏఐటీయూసీ యూనియన్ కార్యాలయ సమావేశం లో బ్రాంచి కార్యదర్శి సలంద్ర సత్యనారాయణ తెలిపారు. అదే విధంగా కాసిపేట 2 గనిలో ప్రమాదానికి గురి అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ పొందుతూ మరణించిన కాసిపేట 2మైన్ మైనింగ్ సర్దార్ మచ్చ రమేష్ కి AITUC పోరాట ఫలితంగా అతని కుటుంబానికి న్యాయం జరిగే విధంగా యాజమాన్యం పై ఒత్తిడి తెచ్చి కృషి చేయడం జరిగిందని అన్నారు. గుర్తింపు సంఘము గా AITUC కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తూ సింగరేణి కార్మిక హక్కులను కాపాడటంలో ముందు వరుసలో ఉంటామని తెలిపారు. ఈ సమావేశం లో బ్రాంచ్ ఉపాధ్యక్షులు బి. సుదర్శన్, జాయింట్ సెక్రెటరీ కంది శ్రీనివాస్ పాల్గొన్నారు.
AITUC
ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలను ఏడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఏడుపే మిగులుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి అన్నారు. కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో మంగళవారం నాడు పెద్ద ఎత్తున జైలు భరో కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో సమ్మెలో ఉన్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైలు భరో కార్యక్రమం మంగళవారం నాటి ఉదయం తిరుపతి నగరంలో జరిగింది. పాత మున్సిపల్ కార్యాలయం నుండి సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు కార్యకర్తలు, నాయకులతో పాటు అంగన్వాడీలు, ఎస్ఎస్ఏ లు పెద్ద సంఖ్యలో ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శన నాలుగు కాళ్ల మండపం వద్దకు చేరుకునేటప్పటికీ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ప్రదర్శనను నిలిపివేయాలని ముందుకు వెళ్లడానికి వీలులేదని ఆంక్షలు పెట్టారు. దీంతో అంగన్వాడీలు, కార్మిక సంఘాల నేతలు నాలుగు కాళ్ల మండపం వద్ద బైఠాయించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉండటంతో మగ పోలీసులతో అరెస్టు చేయటానికి పోలీసులు సంకోచిస్తూ తటపటాయించారు. ముందుకు పోనివ్వకుండా అరెస్టులు చేయకుండా నడిరోడ్డుపై కూర్చోబెట్టడాన్ని సహించలేని కార్మిక సంఘాల నేతలు తాము ప్రదర్శనని చేపడుతున్నామని ప్రకటించి ముందుకెళ్లారు. తూర్పు పోలీస్ స్టేషన్ డిఎస్పీ అందరినీ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించడంతో పోలీసుల నడుమ భారీ సంఖ్యలో అంగన్వాడీలను తూర్పు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియుల నేతలు కందారపు మురళి, కె. రాధాకృష్ణ, ఆర్. హరికృష్ణలు ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. 29 రోజులుగా సమ్మె సాగిస్తుంటే కనీసం సమస్యల పరిష్కారానికి చర్చించకపోగా ఎస్మాను ప్రయోగించి అంగన్వాడీ మహిళలను అపహాస్యం పాలు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడటం ఆనవాయితీగా మారిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తక్షణం కార్మిక సమస్యలు పరిష్కారం చేయకుంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడం ఖాయమని నేతలు హెచ్చరించారు. తూర్పు పోలీస్ స్టేషన్ అంగన్వాడీ మహిళలతో నిండిపోయింది.ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
CITU యూనియన్ నాయకులు చేసిన ట్రాన్సఫర్ ఆర్డర్ ఫై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, ఏఐటీయూసీ యూనియన్ పైన చేసిన ఆరోపణలను మందమర్రి ఏఐటీయూసీ యూనియన్ బ్రాంచి కార్యదర్శి సలంద్ర సత్యనారాయణ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేకే5 గనిలో ఓవర్ మేన్ ట్రాన్స్ఫర్ విషయంలో AITUC యూనియన్ కు ఎలాంటి సంబంధం లేదు. ఈ ట్రాన్స్ఫర్లు గత సంవత్సరం తేదీ 30.9.2023 11 మంది మైనింగ్ స్టాప్ సిబ్బందిని కాసిపేట మైన్ కు బదిలీ చేయడం జరిగినది. కొంతమంది ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని జాయిన్ అయినారు కానీ ఈ ఓవర్ మెన్ ను CITU యూనియన్ వాళ్లు మేము ఆపుతామని అబద్ధపు వాగ్దానాలు చేసి ఆ ఓవర్ మెన్ కు అన్యాయం చేశారు. CITU, ఎన్నికల కోడ్ ఉన్నందువలన ఈ ఓవర్ మెన్ ను రిలీవ్ చేయలేదు. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత పాత ఆర్డర్ ప్రకారం అందరినీ చేసినట్టుగా ఇతన్ని కూడా రిలీవ్ చేసినారు. సిఐటియు అసమర్థత నాయకులు తప్పుడు వాగ్దానం ఇచ్చి మోసం చేసి అతని మనన్నాలను పొందనికి గుర్తింపు సంఘం చేసిందని షో ఫుట్ ఆఫ్ ధర్నాలతో కార్మికులను మభ్యపెడుతున్నారు. ఇదే చిత్తశుద్ధి కార్మిక సమస్యలపై చేస్తే కార్మికులు హర్షిస్తారు. కానీ ఇలాంటి సంఘాలు ఓడిపోయామని అక్కసుతో ఏఐటీయూసీ గుర్తింపు సంఘాన్నిబదనాం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఎన్నికల ముందు యాజమాన్యంతో కుమ్మక్కై ఎన్నికలు ఆపాలని చూసినవాళ్లు ఏఐటియుసిని విమర్శించడం తాగదన్నారు ఆరోపణలు మానుకోండి అని హెచ్చరించారు.
ఐదు డివిజన్లను గెలుచుకుని గుర్తింపు సంఘంగా విజయం సాధించిన AITUC. ఆరు డివిజన్లలో విజయం సాధించి ప్రాతినిధ్య సంఘంగా రెండవ స్థానంలో నిలిచిన INTUC. బెల్లంపల్లి ,మందమర్రి,శ్రీరాంపూర్, రామగుండం-1, రామగుండం-2 డివిజన్లలో AITUC విజయం. కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, భూపాలపల్లి, రామగుండం-3 డివిజన్లలో గెలుపొందిన INTUC. సంస్థ వ్యాప్తంగా 1999 ఓట్ల ఆదిక్యంతో INTUC పై విజయం సాధించిన AITUC. సింగరేణి సంస్థలో 4 వ సారి గుర్తింపు సంఘంగా ఎన్నికైన AITUC .
సింగరేణి ఎలక్షన్ లో INTUC పోలీస్ లకు మధ్య స్వాల్ప ఘర్షణ. సింగరేణి ఎలక్షన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరామ్ పూర్ SRP 1 గని వద్ద పోలీస్ లకు INTUC కార్యకర్తలకు మధ్య స్వాల్ప ఘర్షణ, AITUC నాయకులను పోలింగ్ కేంద్రంలోకి అనుమతుంచి క్యాంపెయిన్ చేపిస్తున్నారని పోలీస్ లతో వాగ్వివాదానికి దిగిన INTUC కార్యకర్తలు.
కార్మికులకు ముక్క చుక్క ఆశ చూపి కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న INTUC సంఘం, గడిచిన 10 సంవత్సరాలలో కార్మికులను పీల్చి పిప్పి చేసిన సంఘం అడుగుజాడలలో INTUC సంఘం నడుస్తుంది. రాజకీయ జోక్యాన్ని పెంచి పోషించే దిశగా అడుగులు వేస్తుంది. కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా, అసలు కార్మికుల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయని సంఘం, కార్మికులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే ఒక్కసారి కూడా ఇటు వైపు చూడని సంఘం ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని గెలుపు కోసం అడ్డమైన దారులు తొక్కుచున్నది. కార్మిక సోదరులారా ఇప్పటికైనా ఆలోచించండి కార్మికుల బాగు కోరే సంఘం ఏదో, స్వలాభం చూసుకునే సంఘం ఏదో. మనం ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మన కోసం ఎంతో మంది అమర నాయకులు సాధించి పెట్టిన హక్కులు మన దగ్గర ఉన్నాయి. అవి మన దగ్గర ఉన్నంత సేపు మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు.
భయం అనే సంక్కెళ్లు తెంచుకొని ఒక్క అడుగు ముందుగా వేసిచూడు నీ బలం ఏంటో నీకే తెలుస్తుంది. నీ వెనుక ఎర్ర జెండ ఉంది, నీకు అండగా AITUC నాయకులు ఉన్నారని సీతారామయ్య అన్నారు. ఆలోచించు మన హక్కులను కాపాడుతూ సింగరేణి ని కాపాడే మన AITUC ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. AITUC గెలుపు సింగరేణి కార్మికుని గెలుపు నక్షత్రం చుక్క గుర్తుకే ఓటు వేసి గెలిపించండి అని కోరారు.
Read Also..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరికాసేపట్లో సింగరేణి ఎన్నికల ప్రచారం ముగియనున్నది. గుర్తింపు సంఘం కోసం జరిగే ఎన్నికల్లో కార్మిక సంఘాల నేతలు పోటాపోటిగా ప్రచారం చేసారు. ప్రచారంలో కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, మరియు బిఆరెఎస్ & కమ్యూనిస్ట్ నేతలు పాల్గొన్నారు. ఈరోజు 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్నది. 27న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది. అనంతరం కౌంటింగ్ జరుగుతుంది. అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సింగరేణి అధికారులు, కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 6 జిల్లాలు, 12 నియోజకవర్గాలు, 13 ఏరియాలలో మొత్తం 39991 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు అలాగే 14 గుర్తింపు కార్మిక సంఘాలున్నాయి. భూపాలపల్లిలో మొత్తం మైన్స్ పై 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు. 5350 మంది ఓటును నమోదు చేసుకున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల పోటీలో INTUC, AITUC, TBGKS, CITU, HMS, BMS కార్మిక సంఘాలున్నాయి.
సింగరేణిలో ఏడో విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 27న సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. సింగరేణిలో అన్ని పార్టీలు తమ సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమించాయి. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం సుమారు 40 వేల మంది కార్మికులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టియుసి కూడా విజయ కేతనం ఎగుర వేసేందుకు ఊవ్విళ్లూరుతోంది. బిఆర్ఎస్ అనుబంధ సంస్థ టిబిజికెఎస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టియుసి యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ కొన సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్ జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి ఉనికి కోసం ఉబలాటపడుతున్నాయి.
తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినా సింగరేణిలో ఏడో విడత గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు యధావిధిగా జరగనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్లో ఉన్న 39,784 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు ఏర్పాట్లు చేనుంది. సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు కోసం 14 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. అధికార కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐ ఎన్ టి యు సి, సిపిఐ అనుబంధ ఎఐటియుసి, బిఅర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, బిజెపి అనుబంధ బిఎంఎస్ తో పాటు హెచ్ఎంఎస్ సంఘాలతో పాటు విప్లవ సంఘాలు బరిలో నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొందడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. గత రెండు పర్యాయాలు గుర్తింపు సంఘం గా వ్యవహరించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ను కార్మికులు తిరిగి ఆదరిస్తారా లేక మరో సంఘానికి పట్టం కడతారా వేచి చూడాలి.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో డిశంబర్ 27న సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో 39,748 మంది సింగరేణి కార్మికులకు గుర్తింపు ఎన్నికలు నిర్వహించబోతున్న సింగరేణి కాలరీస్ కంపెనీ (sccl) యాజమాన్యం. సింగరేణి కొల్ బెల్ట్ ఏరియాలో మందమర్రి డివిజన్ లొ 11 పోలింగ్ బూత్లను ఖరారు చేసారు. మందమర్రి డివిజన్ లొ 5,300 మంది కార్మికులు ఉన్నారు. మందమర్రి మండలంలో డిశంబర్ 27న జరగబోయే ఎన్నికల పోలింగ్ బూత్ లలొ ఓటు హక్కు వినియోగించుకొనున్న సింగరేణి కార్మికులు. సింగరేణి ఎన్నికల కోసం బూత్ ప్రక్రియ ఏర్పాట్లు చేస్తున్న సింగరేణి అధికారులు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగును. అదే రోజు సాయంత్రం మందమర్రి (CER CLAB) సీఈఆర్ క్లబ్ కౌంటింగ్ కేంద్రంలొ 6 గంటల నుంచి ఓట్లు కౌంటింగ్ చేసే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో, ఏఐటీయూసీ,(చుక్క) టీబిజికేఎస్, (బాణం ) ఐఎన్టియూసీ,(గడియారం ) గుర్తు లతో మరియు CITU, HMS, BMS,TNTUC, IFTU, జాతీయ ప్రాంతీయ యూనియన్ సంఘల నాయకులు ఈ సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు ప్రచారం ఉదృతం చేస్తున్న పలు యూనియన్ నాయకులు.






Total views : 78042