మచిలీపట్నంలో వైసీపీ, టీడీపీ నేతల మాటలతో బందరు రాజకీయం రసవత్తరంగా మారింది.మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఏమ్మెల్యే పేర్ని నానిపై తీవ్రస్తాయిలో విమర్శలు చేసారు. బందరు ని గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల కోసం ,కమిషన్ల కోసం, గాలి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. పోర్టు నిర్మాణం పై ఎంత పని జరిగిందో స్వేతపత్రం విడుదల చేస్తారా అనీ డిమాండ్ చేసారు.ఇసుకని యదేచ్చగా అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలు తనను గెలిపిస్తే కొడుకుకి అధికారం ఇచ్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
Andhra Pradesh News
విజయవాడ సెంట్రల్ అజిత్ సింగ్ నగర్ లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి,వైసీపీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ…విజయవాడ నగర అభివృద్ధి విస్తరించడంతో పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించడానికి ఈ నూతన పోలీస్ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నగర శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం అనీ తెలిపారు.
మాజీ సీఎం చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్నారు. అయితే దర్శనాంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టాన్నారు. రేపు సింహాచలం దర్శనం చేసుకుని, 5న శ్రీశైల దర్శనం, తర్వాత దర్గాకు కూడా వెళతానన్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. రాష్ట్రంలో మరల పూర్వ వైభవం వచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వచనం ఇవ్వమని కోరానని తెలిపారు. తన శేష జీవితం ప్రజలకు అంకితమిస్తున్నానన్నారు. నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడనని తెలిపారు. గచ్చిబౌలీలో జరిగిన ఐటీ ఉద్యోగుల సమీకరణకు ఏకగ్రీవంగా అందరూ వచ్చారన్నారు. తన బాగు కోరి అందరూ అనునిత్యం ప్రార్ధించారని.. కొంతమంది ప్రాణ త్యాగాలు కూడా చేశారన్నారు. నిన్న కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చిన వెంకటేశ్వర స్వామిని.. ధర్మాన్ని కాపాడటానికి దర్శనం చేసుకున్నా.. ఇవాళ శక్తి స్వరూపిణి దుర్గమ్మ దర్శనం చేసుకునన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 17తో ముగియనుంది. భీమిలి నియోజకవర్గంలో యువగళం ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ మేరకు టీడీపీ విశాఖ పార్లమెంటు స్థానం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. యువగళం పాదయాత్ర డిసెంబరు 6న అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటకు చేరుకుంటుందని, పాయకరావుపేట 7న మొదలయ్యే యువగళం డిసెంబరు 17తో సమాప్తం అవుతుందని పల్లా శ్రీనివాసరావు వివరించారు. నారా లోకేశ్ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర షురూ చేశారు. 4 వేల కిలోమీటర్లు, 400 రోజుల పాటు పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మధ్యలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో యువగళానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలే లోకేశ్ యువగళాన్ని పునఃప్రారంభించారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. మధ్యంతర బెయిల్ పై విడుదలయిన తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరయింది. హైకోర్టుతో పాటు, సుప్రీంకోర్టు కూడా ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన జనం బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈలోగా ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలవాలని బాబు భావిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. డిసెంబర్ 6 నుంచి 8వ తేదీ లోపల కలిసేందుకు తనకు సమయం కేటాయించాలని సీఈసీకి లేఖ రాయనున్నారు.
గెజిటెడ్ అధికారి అయిన ఓ ఎంపీడీవోపై మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే బహిరంగ వేదికపై దుర్భాషలాడారు. ఎవడ్రా నువ్వు ఏం తమాషాలు చేస్తున్నావా ఏం మాట్లాడుతున్నావు అని మండిపడ్డారు. ఇదీ అయ్యప్ప మాలలో ఉండి కూడా ఆయన ఇలా చిందులు తొక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ‘ఆంధ్రప్రదేశకు జగనే ఎందుకు’ కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల కృష్ణాపురం, పాండ్రంగి తదితర గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమాల ఫొటోలు ఎందుకు అప్లోడ్ చేయలేదంటూ మండల వైకాపా అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు ఎంపీడీవో విజయ్ కుమార్ ను ప్రశ్నించారు. ఆ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొనకపోవడంతో వాటికి సంబంధించినవి అప్లోడ్ చేయలేదని ఎంపీడీవో సమాధానమిచ్చారు. దాంతో ఎమ్మెల్యే బహిరంగ సభ అని కూడా చూడకుండా అందరి ముందూ ఎంపీడీవో ను నోటికొచ్చినట్లు మాట్లాడారు! ఒక దశలో ఎంపీడీవోపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు సుంకర గిరిబాబు వారించారు.
ఇటీవల పాండ్రంగిలో కార్యక్రమం రసాభాస కావడంతో సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరించకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగారన్నారు. తర్వాత సర్పంచి దాన్ని ఆవిష్కరించడంతో ఆ ఫొటోను సిటిజన్ అవుట్ రీచ్ యాప్లో అప్లోడ్ చేశామని, ఆ విషయం సభలో వివరిస్తుండగా ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆగ్రహించారని చెప్పారు.
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత సిఎం జగన్ మోహన్ రెడ్డి దే అని అన్నారు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ సహకారంతో శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త , అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో కలెక్టర్ గిరీషా పిఎస్ తోపాటు ఉమ్మడి కడప జిల్లాల జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలను అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, మునిసిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా ఇతర వైకాపా నేతలు శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ జాబ్ మేళాలో వివిధ రాష్ట్రాల నుంచి 100 కు పైగా కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశం పొందేందుకు నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద ఎత్తున తమ అర్హత ప్రమాణాలతో కూడిన సర్టిఫికెట్స్ తో హాజరయ్యారు. జాబ్ మేళాకు హాజరైన వారికి ఎంపి ఎమ్మేల్యే అద్వర్యంలో అన్ని రకాల వసతులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వంలో యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజే ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు మద్దిలేవుల సుదర్శన్ రెడ్డి, రాయచోటి జడ్పిటిసి వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజు రెహ్మాన్, వ్యవసాయ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు,తో పాటు వైకాపా నాయకులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లాకు తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు ఐ ఎం డి నుండి సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ కె .వెంకటరమణా రెడ్డి శనివారం తెలిపారు. ఐఎండి హెచ్చరికల ఆధారంగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మండల స్థాయి, గ్రామస్థాయిలో ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని ప్రస్తుత సమాచారం మేరకు డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు . అధికారులందరూ అప్రమత్తమై ఉన్నారని, ప్రజలందరూ అవగాహన కలిగి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ముఖ్యంగా 4,5 ఈ రెండు తేదీలలో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల తల్లులు, వృద్దులు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెవెన్యూ శాఖ అధికారులు అందరూ మునిసిపల్ ఏరియాలలో మరియు రూరల్ ఏరియాలలో రిహాబిలిటేషన్(పునరావాస కేంద్రాలు) సెంటర్లు ఏర్పాటు చేయడం జరగుతుందనీ, అలాగే ఈ సెంటర్లలో 24 గంటలు వసతి, ఫుడ్ మరియు ఇతర మెడికల్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఐసిడిఎస్ ముఖ్యంగా 10 రోజుల లోపు డెలివరీ అయ్యే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హాస్పిటల్స్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. చిన్నపిల్లల తల్లులు కూడా రిహాబిలిటేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని అందులో పిల్లలకు సంబంధించిన పాలు, ఆహారం వంటివి అందేలా చూస్తున్నామన్నారు. ప్రధానంగా దృష్టి గుడిసెలలో ఉన్నవారు, కచ్చా గృహాల్లో నివసిస్తున్న వారు కూడా ఈ పునరావాస కేంద్రాలను వినియోగించుకోవాలని, ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులందరూ అప్రమత్తమై వున్నారని, ప్రజల నుంచి కూడా సహకారం కావాలని అందరిని కోరుకుంటున్నానని అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం ఇచ్చేటటువంటి సలహాలను పాటిస్తూ ఉన్నట్లయితే ఈ తుఫానును సునాయాసంగా ఎదుర్కొనవచ్చునని తెలిపారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నర్సాపేటలో పలువురు సీఎం ఇంటి వద్ద ఆత్మహత్యయత్నం చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి తమ ఆస్తులు లాక్కొని మోసం చేశాడంటూ పెట్రోల్ బాటిల్ ను చేతిలో పట్టుకుని వాపోయారు బాధితులు. పోలీసులు వారిని అడ్డుకుని, పెట్రోల్ బాటిల్ ను లాక్కున్నారు. దీంతో తమకు నాయ్యం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా జి వి ఎస్ ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉలవపాడు నందు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సయ్యద్ జిలానీ బాషా, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారపాటి గోపీ చంద్ ప్రకాష్, కామర్స్ అధ్యాపకులు జ్యోతి, కెమిస్ట్రీ అధ్యాపకులు సుభాషిణి, బోటనీ అధ్యాపకులు గంగా భవాని, హిందీ అధ్యాపకులు రఫీ, ఫిజిక్స్ అధ్యాపకులు చల్లా శ్రీనివాసులు, జువాలాజి అధ్యాపకులు వెంకటేశ్వర్లు, తెలుగు అధ్యాపకులు మాధవరెడ్డి, ఇంగ్లీష్ అధ్యాపకులు సుబ్బాచారి, మ్యాథ్స్ అధ్యాపకులు మల్లికార్జున మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా జి వి ఎస్ ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉలవపాడు నందు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సయ్యద్ జిలానీ బాషా, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారపాటి గోపీ చంద్ ప్రకాష్, కామర్స్ అధ్యాపకులు జ్యోతి, కెమిస్ట్రీ అధ్యాపకులు సుభాషిణి, బోటనీ అధ్యాపకులు గంగా భవాని, హిందీ అధ్యాపకులు రఫీ, ఫిజిక్స్ అధ్యాపకులు చల్లా శ్రీనివాసులు, జువాలాజి అధ్యాపకులు వెంకటేశ్వర్లు, తెలుగు అధ్యాపకులు మాధవరెడ్డి, ఇంగ్లీష్ అధ్యాపకులు సుబ్బాచారి, మ్యాథ్స్ అధ్యాపకులు మల్లికార్జున మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.



Total views : 203020