పల్నాడు జిల్లా, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి. అంగన్వాడీలకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మధ్య మాటల యుద్ధం. ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు. సిఐటియు నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట సమస్య పరిష్కారిచేవరకు నిరసన చేస్తామంటున్న అంగన్వాడీలు. సీఎం డౌన్ డౌన్ అంటూ సిఐటియు నేతలు నినాదాలు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.
anganwadi teachers protest
కుప్పంలో అంగన్వాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కుప్పం ఐసిడిఏస్ కార్యాలయం వద్ద నుండి పట్టణంలోని ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ భరత్ పీఏ కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ, అంగన్వాడి వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 15 రోజులుగా సమ్మె చేపడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు. అంగన్వాడిలకు కనీస వేతనం అమలు చేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు.అంగన్వాడిల సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఇప్పటికీ 4 సార్లు ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ యూనియన్లతో చర్చించినా అంగన్వాడిల డిమాండ్లను పరిష్కరించలేదన్నారు.
పలాస లో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు. అడ్డుకున్న పోలీసులు, అంగన్వాడీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట. మంత్రి అప్పలరాజు ఇంటి వద్ద బైటాయించి నినాదాలు తెలుపుతున్న అంగన్వాడీలు. ఆగదీ పోరాటం ఆకల మంటలు పోరాటం అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వం కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మా యొక్క కష్టాలు నీకు తెలియడం లేదా. ఏసీల్లో నీవు ఎండల్లో మేమా అంటూ ఆందోళన. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు మంత్రి సిదిరి అప్పలరాజుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీలందరూ ఇలా ఎండలో రోడ్డుపైకి రావడం దురదృష్టకరమన్నారు. అంగన్వాడీలు రకరకాలుగా తమ నిరసనలు తెలియజేయడంలో తప్పు లేదని కానీ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరచడం బాధాకరమన్నారు.




Total views : 78488