కుప్పంలో అంగన్వాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కుప్పం ఐసిడిఏస్ కార్యాలయం వద్ద నుండి పట్టణంలోని ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ భరత్ పీఏ కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ, అంగన్వాడి వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 15 రోజులుగా సమ్మె చేపడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు. అంగన్వాడిలకు కనీస వేతనం అమలు చేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు.అంగన్వాడిల సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఇప్పటికీ 4 సార్లు ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ యూనియన్లతో చర్చించినా అంగన్వాడిల డిమాండ్లను పరిష్కరించలేదన్నారు.
Anganwadi teachers
పలాస లో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు. అడ్డుకున్న పోలీసులు, అంగన్వాడీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట. మంత్రి అప్పలరాజు ఇంటి వద్ద బైటాయించి నినాదాలు తెలుపుతున్న అంగన్వాడీలు. ఆగదీ పోరాటం ఆకల మంటలు పోరాటం అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వం కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మా యొక్క కష్టాలు నీకు తెలియడం లేదా. ఏసీల్లో నీవు ఎండల్లో మేమా అంటూ ఆందోళన. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు మంత్రి సిదిరి అప్పలరాజుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీలందరూ ఇలా ఎండలో రోడ్డుపైకి రావడం దురదృష్టకరమన్నారు. అంగన్వాడీలు రకరకాలుగా తమ నిరసనలు తెలియజేయడంలో తప్పు లేదని కానీ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరచడం బాధాకరమన్నారు.
గత తొమ్మిది రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, సమ్మె పైన దుష్ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై ఏపీ అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ఉలవపాడు ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద లింగసముద్రం, ఉలవపాడు, గుడ్లూరు మండలాలకు చెందిన అంగనవాడి వర్కర్లు, హెల్పర్లు సుమారు 250 మంది ఈరోజు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసించారు. అంగన్వాడీలు నిరవధిక సమ్మె తొమ్మిది రోజుల నుండి చేస్తున్న పట్టించుకోకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు జీవిబి కుమార్, వాకా. లతా రెడ్డి, ప్రభావతి తదితరులు మాట్లాడారు. సమ్మెపై ప్రభుత్వం దుష్ప్రచారం చేయటాన్ని ఖండించారు. ప్రభుత్వం అనాగరికంగా అంగన్వాడి సెంటర్ల తాళాలు పగల గొట్టటం సిగ్గుచేటు అన్నారు. మహిళలకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వానికైనా తగిన శాస్తి జరుగుతుందన్నారు. ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా, ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరారు. అనంతరం ఉలవపాడు మండల కేంద్రంలో అంగన్వాడి సమ్మెకు మద్దతు ఇవ్వమని అంగన్వాడీల భిక్షాటన,ధర్నా. అనంతరం ఉలవపాడు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ బొమ్మ సెంటర్ లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉలవపాడు మండల అధ్యక్షురాలు వాకాలాతారెడ్డి. ఉలవపాడు ప్రాజెక్టు లీడర్ సిహెచ్ ఇందిరావతి, అన్ని మండలాల నాయకులు ఎస్ కే పద్మజ, బీ మార్తమ్మ,కత్తి. బుజ్జమ్మ,మంచాలి సిహెచ్ పద్మజ, ఎం పద్మ, సిహెచ్ రమాదేవి, కాకర్లపూడి శైలజ, డి వరలక్ష్మి, డి రమాదేవి, సురేఖ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
తమ పిల్లలను అంగన్వాడీ బడులకు ఎలా పంపాలని చిన్నారుల తల్లిదండ్రులు సచివాలయం సిబ్బంది ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని 45,46 అంగన్వాడి కేంద్రానికి చిన్నారులను పంపాలని ఇళ్ళ వద్దకు వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత పాఠశాలల వద్దకు వెళ్లిన తల్లిదండ్రులు మీ మొహాలు తమకు తెలియదని పిల్లలను మీ వద్దకు ఎలా పంపాలని ప్రశ్నించారు. తమ పిల్లల ఆలనా పాలనా మొత్తం అంగన్వాడీ టీచర్, ఆయాలకు తెలుసని మీకు ఎలా తెలుస్తుందని అన్నారు. దీంతో సచివాలయం సిబ్బంది వద్ద సమాధానాలు లేక మౌనంగా కూర్చుండిపోయారు.
Read Also..




Total views : 78488