అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె 28వ రోజుకు చేరుకుంది.. 27 రోజులుగా ప్రొద్దుటూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరవధికంగా ఆందోళన చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం స్పందించడం లేదని వినూత్న కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు పూనుకున్నారు. మోకాళ్లపై నిలబడి ప్రభుత్వం గోవిందా, జగన్ గోవిందా అంటూ నిరసించారు. ఏ రాజకీయ పార్టీ పూరి గొల్పుతే తాము ఆందోళన చేయడం లేదని, ఎన్నో సార్లు ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సమ్మెకు దిగామని అంగన్వాడీలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు, ప్రభుత్వం తనకు తాను ఇంటికి వెళ్లడానికి యస్మా చట్టాన్ని తమపై ప్రయోగించిందని , ఇది బస్మాసుర హస్తం లాంటిదని అంగన్వాడీలు పేర్కొన్నారు. ప్రభుత్వం ఎవరి కోసం ఇలాంటి చట్టాలు తీసుకొచ్చిందని సిఐటియు నాయకులు సత్యనారాయణ ఆచారి ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయమైన అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు
Tag:
anganwadi workers protest with childrens
తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏపి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తున్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో అంగన్వాడీల నిరసనలు 15 వ రోజూ కొనసాగుతున్నాయి. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా కైకలూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్లేట్లపై గరిటెలతో శబ్దాలు చేస్తూ ఆందోళనలు చేశారు. మాట ఇచ్చాడు జగనన్న …మడమ తిప్పాడు జగనన్న, ఇదేమీ రాజ్యం, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అంటూ అంగన్ వాడీలు నినాదాలు చేశారు.




Total views : 78478