బుచ్చినాయుడు కండ్రిగ మండలం పల్లమాల గ్రామపంచాయతీ రెవెన్యూ కి చెందిన పేద రైతుల పొలాలు కాలంగి నది పరివాహక ప్రాంతానికి ఆనుకొని ఉండడంతో ఈసారి తుఫాను సృష్టించిన బీభత్సానికి దాదాపు 100 ఎకరాలలో ఇసుక మెట్లు ఏర్పడ్డాయి… పంట పొలాలు ఎడారులను తలపిస్తున్నాయి… ఈరోజు వరకు అక్కడికి పోలేని పరిస్థితి రైతులు తమ కుటుంబాన్ని పోషించే, నేలతల్లి కోతకు గురై వాగు వంక లాగా తయారవడంతో వారి ఆవేదన వర్ణనాతీతం. ఈసారి భీకరమైన తుఫానుకు అదే సమయంలో కాలంగి నది పొంగిపొర్లడంతో వేల లక్షల టన్నుల ఇసుక గులకరాళ్లు పొలాల వైపుకు దూసుకొచ్చి పంట పొలాలు మాయమై ఇసుక ఎడారిగా మారిన వైనం. 1970 లో అప్పటి ప్రభుత్వం రైతు కూలీలకు పల్లమాల రెవెన్యూలో 220 ఎకరాల సొసైటీ భూమిని సాగు చేసుకోమని ఇవ్వడంతో అప్పటినుండి ఇప్పటివరకు ఏదో ఒక విపత్తుకు గురవుతూ నష్టపోతు ఆర్థికంగా చితికిపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ రైతులు 50 సంవత్సరాలుగా శాశ్వత పరిష్కారం కావాలని అడుగుతూనే ఉన్నారు కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడం కొసమెరుపు. ఏది ఏమైనా వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి (పల్లమాల) సర్పంచ్ భర్త అయినా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ 220 ఎకరాల సొసైటీ భూమి ప్రక్కనే ఉన్న కాలంగి నది పరివాహక ప్రాంతంలో ఒక కల్వర్టు నిర్మిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. దీనికి అయ్యే ఖర్చు దాదాపు 50 లక్షలు…. ప్రతి సంవత్సరం వీరి నష్టం దీనికి మించి ఉంటుంది వారిచే పరిహారం పంట నష్టానికి మాత్రమే…. ఇది పంట నష్టమే కాదు పొలాలలో ఇసుక వచ్చి చేరి తిరిగి పంటకు పొలాన్ని అనువుగా మార్చుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది… ఈ ఖర్చు రైతన్న జీవితాన్ని చిద్రం చేస్తుంది… ఇలాంటి ఘటనలే రైతన్న ఆత్మహత్యలకు కారణమవుతాయి….. అధికారులు గుర్తించి వీరి సమస్యకు శాశ్వతం పరిష్కారం చేయాలని కోరారు.
ap cm jagan mohan reddy video conference
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్ప్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. ప్రతి రైతునూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సబ్సిడీపై విత్తనాల సరఫరాకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.
చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తామన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందిని హామీ ఇచ్చారు. పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.





Total views : 78955